కడ్తాల్ : మండల పరిధిలోని చల్లంపల్లి గ్రామంలో శుక్రవారం అయ్యప్పస్వామి మహాపడి పూజ వైభవంగా నిర్వహించారు. గురుస్వాములు చందర్నాయర్, రాజ్దేశ్పాండే ఆధ్వర్యంలో కన్నెస్వామి మంతాపురం చంద్రశేఖర్ నిర్వహించిన అయ్యప్పస్వామి మహాపడి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జాతీయ బీసీ కమీషన్ సభ్యుడు ఆచారి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలీ శ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా పాల్గొన్నారు. కార్యక్రమాల్లో ముందుగా గణపతి, కుమారస్వాములతో పాటు, నవగ్రహా హోమాలు, నిత్యాభిషేకం, సహస్రనామార్చనలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం అయ్యప్పస్వామి వారికి పూలు, చందనం, పన్నీరు, నెయ్యి, తులసీ దళాలతో అభిషేకం, పడిపూజ కార్యక్రమలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాములు, భక్తులతో కలిసి అన్నదానం (బిక్ష) కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పడి పూజకి వివిధ గ్రామాల నుంచి స్వాములు హాజరయ్యారు.
అనంతరం స్వాములు ఇరుముడిధారణ చేసి శబరిమాల పుణ్యక్షేత్రానికి బయల్దేరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ కృష్ణయ్యయాదవ్, ఉప సర్పంచ్ జైపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్యాదవ్, గ్రామాధ్యక్షుడు ప్రవీణ్గౌడ్, నాయకులు రాములునాయక్, బాలకృష్ణ, భిక్షపతి, రమేశ్, శివ, జంగయ్య, రాములుగౌడ్, స్వాములు చంద్రశేఖర్, వేణుగోపాల్, శ్రీకాంత్, మహేశ్, భక్తులు పాల్గొన్నారు.