కడ్తాల్ : రాష్ట్రంలోని ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా సీఎం కేసీఆర్ చీరలను అందజేస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆడపడుచులు చల్లగా ఉండాలని, బతుకమ్మ పండుగను గొప్పగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి పెద్దన్నలా చీరలను అందజేస్తున్నారని తెలిపారు. కులం, మతం, జాతి బేధం లేకుండా ప్రతి కుటుంబానికి పెద్ద దిక్కుగా సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు.
బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టిందని, బతుకమ్మ, బోనాలను రాష్ట్ర పండుగలుగా గుర్తించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరెడ్డి, తాసిల్దార్ మహేందర్రెడ్డి, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో తేజ్సింగ్, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, వార్డు సభ్యులు భిక్షపతి, మహేశ్, కో-ఆప్షన్ సభ్యులు భాస్కర్రెడ్డి, దీప, టీఆర్ఎస్ మండల అధ్యక్షురాలు వాణీశ్రీ, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్యాదవ్, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్, నాయకులు పాల్గొన్నారు.