కడ్తాల్ : జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లి జాతర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఐదో రోజు అమ్మవారికి పుష్పార్చన, అర్చనలు, హారతి, విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకోని మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ నిర్వాహకులు పూలమాలు, శాలువతో సన్మానించారు.
జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ శిరోలీ, ఈవో స్నేహలత, మహేశ్వరం తాసిల్దార్ ఆర్పీ జ్యోతి, ఆలయ నిర్వాహకులు భాస్కర్నాయక్, అరుణ్కుమార్, ఆలయ సిబ్బంది యాదగిరిస్వామి, బోడ్కనాయక్, చంద్రయ్య, దేవేందర్, వెంకటేశ్, రామకృష్ణ, రమాదేవి, రాములు, కృష్ణ, భక్తులు పాల్గొన్నారు.