రంగారెడ్డి, జూలై 25 (నమస్తే తెలంగాణ) ;వీఆర్ఏల రెగ్యులరైజేషన్పై ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి నిలువెత్తు అభిమానాన్ని చాటారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి.. సీఎం సార్.., వీఆర్ఏ జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు.. కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు వీఆర్ఏలు మాట్లాడుతూ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తమ జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని పేర్కొన్నారు. వీఆర్ఏల విద్యార్హతలను బట్టి వివిధ శాఖల్లో పోస్టులు కేటాయిస్తామన్న సీఎం కేసీఆర్ నిర్ణయానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాలుగా చాలీచాలని వేతనాలతో వెట్టిచాకిరి చేస్తున్నా గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రం వచ్చాకే వేతనాలు పెరుగడంతో తమ బతుకులకు భద్రత ఏర్పడిందన్నారు. వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేసి తమ ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్ నిలబెట్టారని గుండెల్లో పెట్టుకుని పూజిస్తామని పేర్కొన్నారు.
వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వీఆర్ఏలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీఆర్ఏల పట్ల సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. విద్యార్హతల ఆధారంగా కేడర్ నిర్ణయించడంతో మేలు చేకూరుతుందన్నారు. ఎన్నో ఏండ్ల నుంచి తక్కువ జీతంతో పని చేస్తూ ఇబ్బందులు పడుతున్న తమను క్రమబద్ధీకరించడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. దీంతో తమ కుటుంబాలు హర్షం వస్తున్నాయని తెలిపారు. సర్కారు ఎంప్లాయూస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా చాటుకుందన్నారు. వీఆర్ఏల జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంపై ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం
ఆమనగల్లు, జూలై 25 : వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ వారిని విద్యార్హతలపరంగా మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తామని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై మండలంలోని వీఆర్ఏలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమనగల్లు మండల తహసీల్దార్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్ఏల మండల అధ్యక్షుడు బొడిగెల మహేశ్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 23 వేల మందికి లబ్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వీఆర్ఏలు జలాల్, మహేశ్ ఉన్నారు.
అర్హత ప్రాతిపదికన అవకాశాలు కల్పించడం అభినందనీయం
వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొని జీవోను విడుదల చేయడం హర్షణీయం. దీంతో వేల సంఖ్యలో ఉన్న వీఆర్ఏల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. వీఆర్ఏల విద్యార్హతల ప్రాతిపదికన వారికి అవకాశాలు కల్పిస్తానని, వయస్సు పైబడిన వీఆర్ఏల పిల్లలకు సైతం అవకాశం కల్పిస్తానని చెప్పడం శుభసూచకం. విఆర్ఏల మన్ననలను ఆలకించి నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు మా కుటుంబాలు ఎల్లవేళలా రుణపడి ఉంటాయి.
– శ్రీనివాస్, వీఆర్ఏల సంఘం దోమ మండల అధ్యక్షుడు
మా జీవితాల్లో వెలుగులు నింపారు
వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ పే స్కేల్ ప్రకటించి మా జీవితాల్లో వెలుగులు నింపారు. ఎన్నో ఏండ్ల నుంచి వీఆర్ఏలుగా పని చేస్తూ చాలీచాలని జీతంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మా ఇబ్బందులను గమనించిన సీఎం కేసీఆర్ పలు ప్రభుత్వ శాఖల్లో మమ్ములను ఉద్యోగులుగా నియమించేందుకు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్కు కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వానికి వీఆర్ఏలు ఎల్లప్పుడూ అండగా ఉంటారు.
– జంగయ్య, వీఆర్ఏ, నిర్దవెళ్లి,కేశంపేట మండలం
వీఆర్ఏలను కనికరించిన సీఎం కేసీఆర్
వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంతో రుణపడి ఉంటాం. గత ప్రభుత్వాలు వీఆర్ఏలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నో ఏండ్లుగా వెట్టిచాకిరి చేసి జీవితం గడిపారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వీఆర్ఏలను కనికరించారు. పేదల కష్టాలు తెలిసిన నాయకుడు. జీవితాంతం కేసీఆర్ను మరిచిపోము. వీఆర్ఏల కుటుంబాలు కేసీఆర్కు ఎంతో రుణపడి ఉంటాయి.
– ఇబ్రహీం, వీఆర్ఏల సంఘం ఆదిబట్ల మండల కార్యదర్శి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు భద్రత కల్పిస్తున్నదని జడ్పీటీసీ దశరథ్నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్ అన్నారు. గ్రామాల్లోని వీఆర్ఏల ఉద్యోగాలను క్రమబద్ధీకరించి వివిధ శాఖలకు బదిలీ చేయడంతోపాటు పే స్కేల్ ప్రకటించడంతో, మంగళవారం కడ్తాల్లోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి వీఆర్ఏలతో కలిసి ప్రజాప్రతినిధులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, వీఆర్ఏలు యాదమ్మ, శ్రీకాంత్, మహేశ్, దశరథ్, గోపాల్, శ్రీహరి, లింగయ్య, సురేశ్, రామచంద్రయ్య, రాములు, శ్రీశైలం, కిష్టయ్య, పోచయ్య, నర్సింహ, పర్వతాలు, యాదగిరి, నాయకులు బీక్యానాయక్, గణేశ్నాయక్ పాల్గొన్నారు.
పెద్ద మనసుతో నిర్ణయం తీసుకున్నారు
బొంరాస్పేట, జూలై 25 : వీఆర్ఎలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ వర్తింపచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై దుద్యాలలో వీఆర్ఏలు మంగళవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తాము చేస్తున్న సేవలను గుర్తించి తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించడంపై వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేశారు. వీఆర్ఏల పట్ల సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారని వీఆర్ఏలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండలాధ్యక్షుడు మోహన్, వీఆర్ఏ రాజ్కుమార్ పాల్గొన్నారు.
వీఆర్ఎల క్రమబద్ధీకరణతో చిరుద్యోగుల కుటుంబాల్లో సంతోషం
పరిగి, జూలై 25 : ప్రభుత్వం వీఆర్ఎలను క్రమబద్ధీకరణ చేయడంతో చిరుద్యోగుల కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. వీఆర్ఎల క్రమబద్ధీకరణను హర్షిస్తూ మంగళవారం పరిగిలో వీఆర్ఎలతో కలిసి ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టడంతోపాటు ఎమ్మెల్యేను వీఆర్ఏలు సన్మానించారు. కార్యక్రమంలో పరిగి ఎంపీపీ అరవిందరావు, దోమ జడ్పీటీసీ నాగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు ఆంజనేయులు, రాంరెడ్డి, సీనియర్ నాయకులు అనిల్రెడ్డి, ప్రవీణ్కుమార్రెడ్డి, దోమ వైస్ ఎంపీపీ మల్లేశం, రైతు బంధు సమితి కులకచర్ల మండల అధ్యక్షుడు రాజు పాల్గొన్నారు.
ఆశలు చిగురించాయి
వికారాబాద్ కొత్తగడికి చెందిన నేను పీజీ వరకు చదువుకున్న. 12 సంవత్సరాలుగా వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాను. పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నాం. మాలాంటివారికి ఉద్యోగం పర్మినెంట్ చేయాలని ఎన్నో ఏండ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నాం. ప్రస్తుతం సీఎం కేసీఆర్ వీఆర్ఏల సమస్యలు గుర్తించి వారికి ఉద్యోగ భద్రత కల్పించడం సంతోషంగా ఉంది. గత పన్నెండేండ్ల కల నెరవేరింది. చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతో ఇబ్బందులు పడ్డాం. సీఎం కేసీఆర్ ప్రకటనతో మాలో ఆశలు చిగురించాయి.
– సరోజ, వీఆర్ఏ, వికారాబాద్
‘వీఆర్ఏల క్రమబద్ధీకరణతో సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు.. ఏండ్ల నుంచి వీఆర్ఏలుగా పని చేస్తున్నా గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. స్వీపర్ నుంచి వాచ్మెన్ వరకు విధులు నిర్వర్తించి, చాలీచాలని జీతాలతో కాలం వెళ్లదీసినం.. అప్పట్లో రూ.1475 మాత్రమే జీతం.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వీఆర్ఏల బతుకులకు భరోసా వచ్చింది. వీఆర్ఏల కష్టాన్ని సీఎం కేసీఆర్ గుర్తించి రూ.10,500లకు వేతనం పెంచారు.. గతంలో ఉద్యోగ భద్రత లేదు.. ప్రభుత్వ శాఖలో పని చేస్తున్నామనే ధీమా మాత్రమే ఉన్నది.. తెలంగాణ ప్రభుత్వం వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ఆనందంగా ఉన్నది.. వీఆర్ఏల కుటుంబాలు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాయి..’
– గోపాల్, వీఆర్ఏల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు