మహేశ్వరం, అక్టోబర్ 31 : బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి సబితారెడ్డి అన్నారు. మంగళవారం మీర్పేట్ కార్పొరేషన్కు చెందిన గిరిజన మోర్చా మహిళా నాయకురాలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి వందలాది మంది మంత్రి సబితారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై రోజురోజుకూ బీఆర్ఎస్లోకి చేరికలు పెరుగుతున్నాయన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం లభిస్తుందన్నారు. కష్టపడేవారిని పార్టీ తప్పక గుర్తిస్తుందన్నారు. పార్టీలో చేరిన వారిలో మహిళా అధ్యక్షురాలు అనిత, గిరిజన మోర్చా అధ్యక్షురాలు రమావత్ హాతీరామ్నాయక్ తదితరులు ఉన్నారు.