చేవెళ్ల ప్రాంత ప్రజలకు గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారమే 111జీవో ఎత్తివేశామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్లో నిర్వహించిన రోడ్షోలో మంత్రి పట్నం మహేందర్రెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి పట్లోళ్ల కార్తిక్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి పనులు చేసుకున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల కరెంట్ అందిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. 111జీవో ఎత్తివేతపై కొంతమంది న్యాయపరమైన చిక్కులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటే వాటిని అధిగమిస్తూ వస్తున్నామన్నారు. ఏదేమైనా చేవెళ్ల ప్రాంతానికి మేలు చేసే విధంగాచర్యలు చేపడుతామన్నారు. షాబాద్ మండలంలోని చందనవెల్ల్లి, సీతారాంపూర్లలో బ్రహ్మాండమైన ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదన్న సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడని, చీమకు కూడా హాని చేయని గొప్ప మనస్తత్వం గల వ్యక్తి అన్నారు. గంగిగోవు లాంటి కాలె యాదన్నను మరోసారి గెలిపించుకొని అభివృద్ధిని ప్రోత్సహించాలన్నారు.
-షాబాద్/మొయినాబాద్, నవంబర్ 16
షాబాద్/మొయినాబాద్, నవంబర్ 16 : చేవెళ్ల ప్రాంత ప్రజలకు గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారమే 111 జీవోను ఎత్తివేశామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నా రు. గురువారం ఆయన బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్యకు మద్దతుగా మొయినాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్షోలో మంత్రి పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి కార్తిక్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి మంత్రి కేటీఆర్కు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రోడ్షోలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని ప్రజలు రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తే సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పనులను పూర్తి చేసుకున్న ట్లు గుర్తు చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్తును అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. రైతుబంధు పథకంతో పెట్టుబడిసాయా న్ని అందిస్తున్నది తెలంగాణ మాత్రమేనని.. ఇప్పటికే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లను సీఎం కేసీఆర్ జమ చేసినట్లు ఆయన వివరించారు. రైతుబీమాతో బాధిత రైతు కుటుంబాలకు బీ ఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటున్నదన్నారు. అన్నదాతల అభ్యున్నతి కోసం పలు రకాల చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
తొమ్మిదిన్నరేండ్లలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు వివిధ రకాల సంక్షే మ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నట్లు తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 111 జీవోను ఎత్తి వేసినట్లు.. కొన్ని న్యాయపరమైన చిక్కులున్నాయని వాటిని సవరించుకుంటూ ప్రజలకు మేలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ జీవో ఎత్తివేతతో మొయినాబాద్, చేవెళ్ల మండలాల రైతులకు ఎంతోమేలు జరుగనున్నదన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో శంకర్పల్లికి రైల్వేకోచ్ ఫ్యాక్టరీ వచ్చిందని, షాబాద్ మండలంలోని చందనవెల్లి, సీతారాంపూర్లలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలు ఏర్పాటవుతుండడంతో స్థానిక యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు.
పనిచేసే నాయకుడిని ప్రోత్సహించడం మనందరి బాధ్యత, కర్తవ్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితులైన శాసనసభ్యుల్లో ఒకరన్నారు. ఏ రోజు కావాలంటే ఆ రోజు సీఎంను కలిసే అవకాశముందన్నారు. ఆయన సీఎంను ఎప్పుడూ కలిసిన నియోజకవర్గాభివృద్ధిపైనే చర్చిస్తుంటా ర ని.. సొంత పనులను చేయాలని ఎప్పుడూ కోరలేదన్నారు. అంతేకాకుండా అందరితో కలిసి ఉండే మంచి మనిషి కాలె యాదయ్య అని పేర్కొన్నారు. చీమకు కూడా హాని చేయరన్నారు. తొమ్మిన్నరేండ్లలో నియోజకవర్గంలో ఏ పంచాయితీ, గొడవల్లేవని ప్రజలందరిని ఓ తం డ్రిగా కడుపులో పెట్టుకుని చేసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆయుధాలు సరఫరా చేసే వ్యక్తి అని మంత్రి ఆరోపించారు. ఆయుధాలు సరఫరా చేసేవారు కావాలా..?గంగిగోవులాంటి కాలె యాద య్య కావాలో.. ప్రజలు ఆలోచించి ఈ సారి జరుగనున్న ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
రెండుసార్లు కేసీఆర్ సీఎం కాగానే కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆస రా పింఛన్లు, 24 గంటల కరెంట్, ఇంటింటికీ నల్లానీరుతోపాటు 111 జీవో ఎత్తివేత, పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాంతానికి వచ్చాయని.. మూడోసారి కేసీఆర్ సీఎం కాగానే ఆడబిడ్డలకోసం పలు కార్యక్రమాలను అమల్లోకి తీసుకొస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కల్యాణలక్ష్మి మాదిరిగానే సౌభాగ్యలక్ష్మి అనే కొత్త కార్యక్రమం ద్వారా 18 ఏండ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకూ నెలకు రూ.3 వేల చొ ప్పున అందించడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఆసరా పింఛ న్ల రూ.2016 నుంచి దఫాదఫాలుగా రూ.5016 పెంపు, రూ.400కే సిలిండర్, ప్రతి ఇంటికీ సన్నబియ్యం లాంటి పథకాలు అమలవుతాయన్నారు. అందుకే నేను కోరేది ఒక్కటే.. తెలంగాణ, చేవెళ్ల ప్రశాంతంగా ఉండాలన్నా.. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికీ అందాలన్నా కారు గుర్తుకు ఓటేసి కాలె యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
జనాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో రోడ్షో సక్సెస్ అయ్యింది. బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. కార్యక్రమంలో ఆయా మండలాల జడ్పీటీసీలు పట్నం అవినాశ్రెడ్డి, కాలె శ్రీకాంత్, మర్పల్లి మాలతి, గోవిందమ్మ, కాలె జయమ్మ, ఎంపీపీలు గునుగుర్తి నక్షత్రం, కోట్ల ప్రశాంతిరెడ్డి, విజయలక్ష్మి, గోవర్దన్రెడ్డి, భవాని, శంకర్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మాజీ జడ్పీటీసీ కొంపల్లి అనంతరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు స్వప్న, తెలంగాణ ఉద్యమకారుడు దేశమళ్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు దేవరాంపల్లి మహేందర్రెడ్డి, గూడూరు నర్సింగ్రావు, పె
ద్దోళ్ళ ప్రభాకర్, గోపాల్, వాసుదేవ్కన్నా, నాగిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింగ్రావు, వెంకటరంగారెడ్డి, ప్రశాంత్గౌడ్, పాపారావు, బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు సుధాకర్యాదవ్, జయవంత్, బాల్రాజ్, ప్రధాన కార్యదర్శి నర్సింహాగౌడ్, రైతుసమన్వయ సమితి జిల్లా సభ్యుడు ప్రభాకర్రెడ్డి, మండల కో-ఆర్డినేటర్ శ్రీహరియాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రావూఫ్, లీగల్సెల్ మండల అధ్యక్షుడు సురేందర్గౌడ్, యువజన విభాగం అధ్యక్షుడు రమేశ్, పార్టీ నాయకులు నర్సింహారెడ్డి, పెంటారెడ్డి, శ్రీనివాస్గౌడ్, శేరిగూడెం వెంకటయ్య, వెంకట్రెడ్డి, రాజు, జగన్మోహన్రెడ్డి, రాము, భిక్షపతిగౌడ్, రాజూగౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే రెండుసార్లు అవకాశమిచ్చారు.. మరోసారి అవకాశమిస్తే మరింత సేవ చేస్తా. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలోని పాలకులు ప్రజల అభివృద్ధి గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతే సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నది. ఇప్పటికే ఇంటింటికీ మిష న్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నది. అంతేకాకుండా ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నది. సీఎం కేసీఆర్, మంత్రి రామన్న సహకారంతో షాబాద్ మం డలంలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలు ఏర్పాటయ్యాయి. మంత్రులు సబితారెడ్డి, మహేందర్రెడ్డి సహకారంతో సీతారాంపూర్, చందనవెల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కంపెనీలను తీసుకొచ్చా.
సీతారాంపూర్లో కిటెక్స్ కంపెనీ ఏర్పాటుతో 35 వేల మంది మహిళలకు ఉపాధి లభించనున్నది. నవాబుపే ట మండలంలో ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం లో ఉన్నది. 84 గ్రామాలకు గుదిబండలా ఉన్న 111 జీవోను ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తివేయడం సంతోషకరం. మాయమాటలు చెప్పే మతతత్వ పార్టీలు.. కులాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలు వస్తున్నాయి.. నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేవెళ్ల నియోజకవర్గం, రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నది.
సెగ్మెంట్లో ముఠా రాజకీయాలు, ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్ష పార్టీల నాయకులు మాట్లాడితే చూస్తూ ఇరుకోం. నేను ఎక్కడైనా ఎకరం భూమినైనా కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలకు గుడ్బై చెబుతా. నాపై ఆరోపణలు చేసే వారు బహిరంగ చర్చకు రావాలి. అందుకు నేను కూడా సిద్ధమే. సంక్షేమ పథకాలు సజావుగా కొనసాగాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాలి. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా రాష్ర్టాన్ని ఆయన ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మూడోసారి సీఎంగా కేసీఆర్ను, చేవెళ్ల నుంచి ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలి.
-కాలె యాదయ్య, బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల అభ్యర్థి, ఎమ్మెల్యే