మూడేండ్లుగా సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదవుతున్నది. ఈ వానకాలం సమృద్ధిగా వర్షాలు కురువడంతో చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భ జలాలు సైతం గణనీయంగా పెరిగి బోరుబావుల్లోనూ పుష్కలంగా నీరు ఉన్నది. రంగారెడ్డి జిల్లాలోని 2,083 చెరువుల్లోకి నీరు సమృద్ధిగా వచ్చి చేరింది. నిరంతర కరెంట్తో పాటు సాగునీటికీ రంది లేకపోవడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. ఇప్పటి వరకు 3,06,279 ఎకరాల్లో అన్నదాతలు వివిధ రకాల పంటలను సాగు చేశారు. పెరిగిన భూగర్భజలాల కారణంగా కందుకూరు వంటి ప్రాంతాల్లో 1.40 మీటర్ల లోతులోనే నీరు ఉండడం విశేషం. ‘మిషన్ కాకతీయ’ ఫలితంగా చెరువులు, కుంటల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. పొలాలు పచ్చని పంటలతో కళకళలాడుతుండడంతో అన్నదాత మోములో ఆనందం కనిపిస్తున్నది.
రంగారెడ్డి, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : వానకాలం సీజన్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు జిల్లా వాసులను భయపెట్టినా కరువును మాత్రం తుడిచిపెట్టాయి. పాతాళ గంగమ్మ సైతం పైకి ఉబికి వచ్చింది. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. గత మూడేండ్లుగా జిల్లాలో సాధారణానికి మించి వర్షపాతం నమోదవుతున్నది. ఫలితంగా బావులు, బోర్లు రీఛార్జ్ అయ్యాయి. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని 2,083 చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఇందులో 200పైగా చెరువు లు పూర్తిగా నిండి అలుగుపోస్తున్నాయి. వానకాలం సీజన్కు సంబంధించి జిల్లాలో వివిధ పంటల సాగు మూడు లక్షల ఎకరాలను దా టింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వానాకాలం పంటలకు ఢోకా లేదని అన్నదాతలు మురిసిపోతున్నారు.
17 మండలాల్లోనూ అత్యధికం..
జూన్లో వరుణుడు ముఖం చాటేసినప్పటికీ ఆ తర్వాత నుంచీ తన ప్రభావాన్ని చూపుతున్నాడు. జూన్లో 91.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 82.6 మి.మీ వర్షం కురిసింది. జూలైలో 153 మి.మీ సాధారణ వర్షపాతానికి మించి 307.7మి.మీటర్లు, ఆగస్టులో 140.9మి.మీలకు 3.5మి.మీ వర్షం కురిసింది. అదేవిధంగా సెప్టెంబర్లో 121 మి.మీ సాధారణ వర్షపాతానికిగాను పదిరోజుల్లోనే సాధారణానికి మించి 143.3 మిల్లీమీట ర్ల వర్షం కురిసింది. ఈ నెలాఖరు నాటి కి వర్షపాతం గణనీయంగా నమోదు కానున్నది. ఈ సీజన్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 530.4 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 574 మి.మీ కురిసింది. 2019 నుంచి 2023 వరకు ప్రతి ఏడాది సాధారణానికి మించి వర్షపాతం నమోదవుతున్నది. ఈ ఏడా ది 725.8మి.మీ కురవాల్సి ఉండగా.. సెప్టెంబర్ 10 నాటికే 574 మి.మీ కురిసింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని 17 మం డలాల్లోనూ సాధారణానికి మించి అత్యధిక వర్షపాతం నమోదైంది.
జోరుగా సాగు..
జిల్లాలో వానకాలం సీజన్లో సమృద్ధ్దిగా వర్షాలు కురువడంతో పంటల సాగు సైతం జోరు మీదున్నది. ఇప్పటివరకు 3,06,279 ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేశారు. అత్యధికంగా పత్తి 1,30,968 ఎకరాల్లో సాగు కాగా.. వరి 92,225 ఎకరాల్లో సాగైంది. వర్షాలకు తోడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు సైతం ఫలించి రైతుల్లో భరోసా నింపాయి. గత ఆరు, ఏడేండ్లుగా నీటి సంరక్షణకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడంతో జిల్లాలో గతంలో కంటే పరిస్థితులు మెరుగుపడ్డాయి. మిషన్ కాకతీయ పథకంతో చెరువులకు పూర్వవైభవం తీసుకురావడం, ఉపాధిహామీ పథకంలో నీటి నిల్వకు సంబంధించిన పనులను విరివిరిగా చేపట్టడంతో భూగర్భ జలాలూ పెరిగాయి. 24 గంటల ఉచిత విద్యు త్తు సరఫరా, రైతుబంధు సాయం కూడా రైతుల ఆశలను సజీవంగా నిలిపాయి.