ఇబ్రహీంపట్నం : జిల్లా పీఆర్టీయూ నూతన క్యాలెండర్ను శనివారం విద్యాశాఖ మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముందుగా మంత్రి సబితారెడ్డికి నూతన సందత్సర శుభాకాంక్షలు తెలిపారు. వికరాబాద్ జిల్లాకు వెళ్లిన రంగారెడ్డి జిల్లా స్థానిక ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కేశవులు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, నాయకులు కరుణాకర్రెడ్డి, కృష్ణ, ఆనంద్కుమార్, అదృష్టరావు, వెంకటయ్య పాల్గొన్నారు.