వికారాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): పోక్సో చట్టాన్ని పకడ్బందీగా అమలయ్యేలా చూ డాలని హైకోర్టు జడ్జి ఎంజీ. ప్రియదర్శిని అధికారులను ఆదేశించారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని కోర్టులో మహిళలు, బాలికలపై పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు, రెవెన్యూ, స్త్రీ, శిశు సం క్షేమం, విద్యావైద్యశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోక్సో కేసులు పెరుగుతున్న దృష్ట్యా ..ఆ చట్టంపై స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. పోక్సో బాధితురాలిని దవాఖానకు తీసుకెళ్లే సమయంలో వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ డీఎంహెచ్వోను ఆమె ఆదేశించా రు. అదేవిధంగా జిల్లాలో అధికంగా జరుగుతు న్న బాల్యవివాహాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు బడిబయట పిల్లలపై ప్రత్యే క దృష్టి సారించాలన్నారు.
అనాథ పిల్లలను దత్త త తీసుకున్న వారిపై దృష్టి పెట్టి పిల్లల బాగోగులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. జి ల్లాలో డ్రగ్స్, గంజాయి విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని.. బడులు, కాలేజీల వద్ద ప్రత్యేక నజర్ పెట్టాలని పోలీసులను ఆదేశించారు. పట్టణాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ను అరికట్టాలని.. పేదలకు న్యాయం భారం కాకుండా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులకు న్యాయమూర్తి ప్రియదర్శిని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి కె.సుదర్శన్, సీనియర్ సివిల్ జడ్జి శీతల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్, ఇన్చార్జి డీఆర్వో అశోక్, డీఎంహెచ్వో పాల్వన్కుమార్, డీఈవో రేణుకాదేవి, ఆర్డీవో విజయకుమారి, వికారాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మా ధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి జగన్, డీఎస్పీలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు..
ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంటున్నారని హైకోర్టు జడ్జి ప్రియదర్శిని అన్నారు. శనివారం పరిగిలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో నిర్మించిన బార్ అసోసియేషన్ నూతన భవనాన్ని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి సుదర్శన్తో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. నేటి యు వత డాక్టర్, ఇంజినీరింగ్ విద్యను చదివేందుకే అధికంగా ఆసక్తి చూపుతున్నదని.. ఈ రెండింటితోపాటు ఇతర రంగాల్లోనూ దృష్టి సారించాలన్నారు. న్యాయ విద్యను అభ్యసిస్తే కోర్టుల్లో సేవలందించేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. పరిగి కోర్టులో 2,500 కేసులు పెండింగ్లో ఉన్నాయని, ఒక న్యాయాధికారి అన్ని సమస్యల ను పరిష్కరించలేరని, రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాలు రాజీ కుదుర్చుకుంటే ఇద్దరూ గెలుస్తారన్నారు. లోక్ అదాలత్ల్లో కేసులు పరిష్కరం అవుతాయని.. కోర్టు ఫీజు కూడా తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు.
బార్ అసోసియేషన్ సభ్యు ల కోరిక మేరకు పరిగి కోర్టు ఆవరణలో కొత్త భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తే హైకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్తానని.. పరిగి లో అదనపు కోర్టు ఏర్పాటుకు తనవంతు ప్రయ త్నం చేస్తానని జడ్జి ప్రియదర్శిని చెప్పారు. అంతకుముందు ఆమె కోర్టు ఆవరణలో మొక్కలు నా టారు. అనంతరం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి సుదర్శన్ మాట్లాడుతూ బార్ అసోసియేషన్ నూతన భవన నిర్మాణంతో న్యాయవాదులకు మంచి వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. పరిగి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్యాదవ్ మాట్లాడుతూ పరిగి కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నందున అదన పు కోర్టు, కోర్టు భవనాన్ని కూడా మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో పరిగి జూనియర్ సివిల్ జడ్జి హరికుమార్, జిల్లా అదనపు ఎస్పీ మురళీధర్రావు, బార్ కౌన్సిల్ సభ్యులు అనంతసేనారెడ్డి, రామారావు, తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీవో శేషగిరిశర్మ, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అనంత పద్మనాభ స్వామి జడ్జి
ధారూరు, ఫిబ్రవరి 4: అనంత పద్మనాభస్వామిని హైకోర్టు జడ్జి ప్రియదర్శిని శనివారం దర్శించుకున్నారు. జడ్జి వెంట వారి కుమారు డు, జిల్లా న్యాయమూర్తి, సబ్ కోర్టుల న్యాయమూర్తులు, వికారాబాద్ తహసీల్దార్, సీఐ ఉన్నారు. అర్చకులు వారిని ఆలయంలోకి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ధర్మకర్త ఎన్. పద్మనాభం, ఈవో నరేందర్ తెలిపారు.