తుర్కయాంజాల్, మే 12 : అన్నదాతలు అధైర్యపడొద్దని.. పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొంటుందని రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూర్లో జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం వారు ప్రారంభించి మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రైతులు పండించిన ధాన్యాన్ని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నదని కొనియాడారు.
రైతు లు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభు త్వ మద్దతు ధరను పొందాలని సూచించా రు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారిణి కవిత, తుర్కయాంజాల్ రైతు సేవా సహకార సంఘం వైస్ చైర్మన్ రాంరెడ్డి(పాల రాంరెడ్డి), డైరెక్టర్లు సామ సంజీవరెడ్డి, కృష్ణారెడ్డి, యాదగిరి, రైతుబం ధు సమితి అబ్దుల్లాపూర్మెట్ మండల కో-ఆర్డినేటర్ బలదేవరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు అమరేందర్రెడ్డి, నాయకులు సంపతీశ్వర్రెడ్డి, అయ్యప్పరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మంచాలలో రెండు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
మంచాల : రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటున్నదని.. ప్రతిపక్ష పార్టీల నాయకులు రాద్ధాంతం చేయడం సరైంది కాదని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నా రు. శుక్రవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. రైతుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఇప్పటికే మంచాలలో రెండు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసిందని.. ఆ కేంద్రాల్లో రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొం దుతున్నారని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు అనవసరంగా విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు. రైతు సంక్షేమమే ధ్యేయం గా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
బాచారం, బండరావిరాల గ్రామాల్లోనూ..
అబ్దుల్లాపూర్మెట్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని బాచా రం, బండరావిరాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ రేఖామహేందర్గౌడ్, జడ్పీటీసీ దాస్గౌడ్, హయత్నగర్ రైతు సహకార సంఘం చైర్మ న్ కృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ధాన్యాన్ని మధ్యవర్తులకు అమ్మి మోసపోవద్దని రైతులకు సూచించా రు. ఇటీవల వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం త్వరలో అం దుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లు సంతోషాకిషన్, వనజాశ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ అనితామహేందర్గౌడ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బల్దేవ్రెడ్డి, కవిత, డీసీఎంఎస్ మేనేజర్ రామకృష్ణారాజు పాల్గొన్నారు.