కోట్పల్లి, ఏప్రిల్ 26 : పల్లెలను అభివృద్ధి పరుచడమే లక్ష్యంగా ప్రభుత్వం సాగుతున్నదని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం కోట్పల్లి మండలంలోని ఇందోల్, ఓగ్లాపూర్ గ్రామాల్లో నూతనంగా 40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభం, అన్నాసాగర్, కోట్పల్లి గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాలను ప్రారంభించారు. అనంతరం కోట్పల్లిలో రూ.కోటీ 13 లక్షలతో నిర్మించిన మార్కెట్ యార్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పల్లె పల్లెకూ తిరిగి సమస్యలను తెలుసుకుని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో పేదింటి ఆడ బిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వారికి భరోసాను కల్పిస్తున్నదని తెలిపారు. పంట పెట్టుబడి సాయంగా రైతు బంధు, రైతు బీమా కింద రూ.5లక్షలను అందించి ఆదుకుంటుందని అన్నారు. రూ.6 కోట్ల నిధులతో 6 పంచాయతీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం జరిగిందని అన్నారు. మరింత అభివృద్ధి పరిచేందుకు గ్రామానికో రూ.50లక్షలను మంజూరు చేసినట్లు తెలిపారు. కోట్పల్లి మండల కేంద్రానికి కోటి రూపాయలను వెచ్చించడం జరిగిందని అన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు అనిల్కుమార్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్, వైస్ చైర్మన్ దశరథ్గౌడ్, సర్పంచులు రామచందర్, శోభారాణి, లక్ష్మీవెంకటయ్య, చంద్రకళపెంటారెడ్డి, రాధాకృష్ణ, ఎంపీటీసీ అంబికరాజు, నాయకులు రాములు, మల్లేశం, పాండు, తింగారెడ్డి, రవిగౌడ్, దినేశ్కుమార్, సుశీల్కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.