శంకర్పల్లి, సెప్టెంబర్ 15 : భక్తులు నిమజ్జన కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య సూచించారు. బుధవారం శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో వరసిద్ధి వినాయక మండపంలో ప్రతిష్ఠించిన వినాయకుడ్ని ఎమ్మెల్యే దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతీ వీధిలో వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో శంకర్పల్లి మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్కుమార్, నాయకులు గోపాల్రెడ్డి, బెజుగం రాజేశ్వర్, బాలకృష్ణ పాల్గొన్నారు.