భీమ్గల్, ఏప్రిల్ 18: రైతులు ధాన్యం విక్రయాలపై దళారులను ఆశ్రయించవద్దని జిల్లా సహకార అధికారి సింహాచలం, డీఆర్డీవో పీడీ చందర్నాయక్ సూచించారు. మండలంలోని సికింద్రాపూర్, బెజ్జోర, పురాణిపేట్, జాగిర్యాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కోనుగోలు కేంద్రాలను వారు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. తహసీల్దార్ రాజేందర్, ఎంపీడీవో రాజేశ్వర్, ఐకేపీ డీపీఎం సాయిలు, ఏపీఎం శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు ప్రతిభ, తోట శంకర్, మానస, సంధ్య, ఎంపీటీసీలు సుమలత, సాయి పాల్గొన్నారు.
అభంగపట్నంలో..
నవీపేట, ఏప్రిల్ 19: మండలంలోని ఆభంగపట్నం గ్రామం లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సర్పంచ్ ఎం.రమాదేవి ఎంపీడీవో సయ్యద్ సాజిద్ అలీతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ..రైతులు ధాన్యాన్ని ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్ సాజీద్ అలీ, వైస్ ఎంపీపీ హరీశ్, గ్రామ కార్యదర్శి రామాగౌడ్,ఉప సర్పంచ్ రాము, గ్రామ మహిళా సమైఖ్య ప్రతి నిధులు రైతులు పాల్గొన్నారు.
ముప్కాల్లో..
ముప్కాల్ , ఏప్రిల్ 19: మండల కేంద్రంలో వేంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైస్ చైర్మన్ బద్దం నర్సారెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు సామ వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు కొమ్ముల మోహన్ రెడ్డి, బాపురావు, శ్రీనివాస్,రవి,లక్ష్మీనారాయణ, వంశీ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం