బేగంపేట్, ఏప్రిల్ 24 : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నగరానికి కృష్ణ, గోదావరి జలాలు తీసుకువచ్చి ప్రజల దాహార్తిని తీర్చామని, అవుటర్ రింగ్రోడ్డు, ఎయిర్పోర్ట్, మెట్రోరైల్, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు తీసుకువచ్చారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ కోసం బుధవారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ప్యాట్నీ సెంటర్ కార్నర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ను గెలిపించాలని కోరారు. ఇప్పటి వరకు కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి సికింద్రాబాద్కు చేసింది ఏమీ లేదన్నారు. అనంతరం దానం నాగేందర్ ర్యాలీగా వెళ్లి జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో అంజన్కుమార్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.