వికారాబాద్ : 2021-22 విద్యాసంవత్సరానికి గాను ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష ఈ నెల 21న జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదర్శ పాఠశాల (మాడల్ స్కూల్)లో 6,7,8,9,10వ తరగతిలలో ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. 6వ తరగతి ప్రవేశ పరీక్ష 21వ తేది శనివారం ఉదయం 10నుంచి 12గంటల వరకు, 7,8,9,10 తరగతులకు మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కొవిడ్19 నిబంధనలు పాటిస్తూ, సమయానుకూలంగా పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు.