ఇబ్రహీంపట్నంరూరల్ : మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో ఊరకుక్కల దాడిలో బండ బీరప్పకు చెందిన సుమారు లక్ష రూపాయలు విలువ చేసే 20 గొర్రెలలు మృతిచెందాయి. గొర్రెలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న బీరప్ప కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ శుక్రవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి సర్పంచ్ మల్లీశ్వరి జంగయ్య, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఐలేష్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఊర కుక్కలు విపరీతంగా పెరిగిపోయినందున వాటిని గ్రామంలో నుంచి నిర్మూలించేందుకు కృషిచేయాలని కోరారు.