తుర్కయాంజాల్, అక్టోబర్ 25 : ప్రజా బలంతో ఇబ్రహీంపట్నం గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధి సూర్య సాయినగర్, గంగిరెడ్డి నగర్, జనచైతన్య, శ్రీరామ్నగర్, శ్రీశ్రీ హోమ్స్ కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేసిన అభివృద్ధిని చూసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో ఇప్పటికే రూ.2931 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో 80 శాతంపైగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని వివరించారు.
బీఆర్ఎస్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని, అన్ని ప్రాంతాలు గతంతో పోల్చితే అభివృద్ధి చెందాయని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో అమలు చేయలేని హామీలను చెప్పి ప్రజలను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, వారిని నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్కు ఉందని, తిరిగి మళ్లీ అది పునరావృతం అవుతుందని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, నాయకులు కందాడి లక్ష్మారెడ్డి, జక్కా రాంరెడ్డి, సామ సంజీవరెడ్డి, కొంతం యాదిరెడ్డి, మేతరి శంకర్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చేసిన అభివృద్ధి పనులతో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావని, దానికి తోడు సంక్షేమ పథకాలతో మరోసారి గెలవడం ఖాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బూత్ ఇన్చార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధ్దరణ, వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు, ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు, నూతన రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు భానుబాబు, జగన్, సుల్తాన్, శంకరయ్య, సుధాకర్, మున్సిపల్ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్రావు, బీఆర్ఎస్ నాయకులు తాళ్ల మహేశ్గౌడ్, ఆకుల యాదగిరి, రవీందర్, మల్లేశ్, షబ్బీర్, రవి, రమేశ్, ప్రవీణ్, కిరణప్ప, నిట్టు జగదీశ్వర్, వినోద్కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మంచాల : ఇబ్రహీంపట్నం గడ్డపై మంచిరెడ్డి కిషన్రెడ్డి మరోసారి గెలవడం ఖాయమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్ అన్నారు. బుధవారం మంచాల మండలం నోముల గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి కిషన్రెడ్డి గెలుపు కోసం కార్యకర్తలతో కలిసి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థి కిషన్రెడ్డి చేసిన అభివృద్ధిని వివరించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బహదూర్, ఏర్పుల చంద్రయ్య, పుల్లారెడ్డి, పల్నాటి బాల్రాజ్, నర్ల ప్రభాకర్, చింతకింది వీరేశం తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితోనే సాధ్యమని ఎంపీపీ కృపేశ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల పరిధిలోని పోచారం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ఉమ్మడి పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరవ, ముఖ్యమంత్రి కేసీఆర్ చల్లని దీవెనలతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. నియోకజవర్గం మరింత అభివృద్ధి చెందటం కోసం మరోసారి ఎమ్మెల్యే కిషన్రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మండల పరిధిలోని కప్పాడు గ్రామంలో బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందటం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిని మరోసారి అధిక మెజార్టీతో గెలిపించేందుకు కారు గుర్తుకు ఓటువేయాలని ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు అవగాహన కల్పించారు. సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరిందన్నారు. అభివృద్ధిని ఉరకలు పెట్టించే బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటువేసి మరోసారి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బాలరాజు, బీఆర్ఎస్ నాయకులు ఆకుల సురేశ్, నర్సింగ్రావు, గిరి, సత్యనారాయణ, వినోద్, సాయికుమార్, బాబా త్రిలోక్ పాల్గొన్నారు.