యాచారం : గొల్ల, కుర్మ కులస్తులను కించపర్చేలా మాట్లాడిన సినీ నటుడు మోహన్బాబుపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం జిల్లా నాయకుడు అమీర్పేట మల్లేష్ మంగళవారం యాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్లేశ్ విలేకరులతో మాట్లాడుతూ మా ఎన్నికల అనంతరం తన కుమారుడు మంచు విష్ణు విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గొల్ల, కురుమ కులస్తులను కించపరుస్తూ మోహన్బాబు మాట్లాడారన్నారు.
మా ఎన్నికల్లో గొర్రెలు మేపుకునేవాడి వద్ద కూడా సెల్ఫోన్ ఉంది అంటూ కులాన్ని కించపర్చేలా మాట్లాడారన్నారు. పోలీసులు వెంటనే అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదును కోర్టుకు పంపించామని కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.