యాచారం, జూన్ 1 : మండలంలోని మేడిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్స్టేషన్ ప్రారంభానికి సిద్ధ మైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫార్మాసిటీ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో సెక్యూరిటీని కల్పించేందుకు మేడిపల్లిలోని ఓ అద్దె భవనంలో రాచకొండ పోలీసులు అన్ని వసతులతో తాత్కాలికంగా ఠాణాను ఏర్పాటు చేశారు. ఇటీవలే మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్రావు సైతం ఆ భవనాన్ని సందర్శించి ఏర్పా ట్లు ముమ్మరం చేయాలని, అన్ని వసతులు కల్పించాలని పోలీసులకు సూచించారు. గ్రామంలో త్వరలోనే ఠాణాకోసం పక్కా భవనాన్ని నిర్మించనున్నా రు. ఇందుకోసం ఇప్పటికే అధికారులు స్థలాన్ని కూ డా గుర్తించారు. పక్కాభవనం నిర్మాణం పూర్తి కాగా నే సీఐ, ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు ఏఎస్ఐలు, 20 మంది కానిస్టేబుల్లతో స్టేషన్ను కొనసాగించేందు కు కసరత్తు చేస్తున్నారు. అప్పటివరకు ఎస్ఐ కొంతమంది సిబ్బందితో ఇక్కడ పోలీసులు విధులు నిర్వహించనున్నారు. గురువారం సీఐలింగయ్య, ఎస్ఐ ప్రసాద్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పోలీస్స్టేషన్ భవనాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
‘ఫార్మాసిటీ’కి సెక్యూరిటీగా..
యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటుకు పూర్తి స్థా యిలో సెక్యూరిటీని కల్పించేందుకు మేడిపల్లిలో తాత్కాలిక పోలీస్స్టేషన్ను ప్రభుత్వ ఆదేశాల మేర కు రాచకొండ పోలీసులు ఏర్పాటు చేశారు. మండలంలోని నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద్ద, మేడిపల్లి గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే.. ఇవి సమస్యాత్మక గ్రామాలు కావడంతోపాటు సాగర్ రహదారికి.. హైదరాబాద్కు సమీపంలో ఉండటంతో మేడిపల్లి గ్రామాన్ని ఎంచుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. పైగా ఫార్మా పనులు ముమ్మరమైతే ఉన్నతాధికారులు, జిల్లా, రాష్ట్ర స్థాయి ముఖ్యఅతిథులు, దేశ, విదేశీయులు, ఇంజినీర్లు, టీఎస్ఐఐసీ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర వ్యక్తులు తరచూ ఇక్కడికి పర్యటించనున్న నేపథ్యంలో వారి భద్రత కోసం ఇక్కడ పోలీస్స్టేషన్ అవసరమని భావించి.. ఠాణాను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.ఠాణా ఏర్పాటుతో ఫార్మా భూనిర్వాసితుల ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, ఘర్షణలు, గొడవలు, గ్రూ పు తగాదాలు, రోడ్డు ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పడనున్నది.
ఠాణా పరిధిలో 19 గ్రామ పంచాయతీలు
మేడిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పోలీస్స్టేషన్ పరిధిలోకి యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాలలకు చెందిన 19 గ్రామపంచాయతీలు వాటి అనుబంద గ్రామాలు రానున్నాయి. యాచారం మండలం నుంచి మేడిపల్లి, నక్కర్త, నానక్నగర్, పిల్లిపల్లి, తాటిపర్తి, గొల్లగూడ, కుర్మిద్ద, మర్లకుంటతండా, కందుకూరు మం డలం నుంచి సాయిరెడ్డిగూడ, ము చ్చర్ల, ఉట్లపల్లి, మీర్ఖాన్పేట, ఆకులమైలారం, పంజాగూడ, మాలగూడ, బేగరికంచె, సార్లరావులపల్లి, సార్లరావులపల్లి తండా, బండమీదితండా, గుట్టలతండా, పోచమ్మగడ్డతండా, పోతుగడ్డతండా కడ్తాల మండలం పల్లెచెల్కతండాలను ఎంపిక చేశారు.
త్వరలోనే ప్రారంభం
మేడిపల్లిలో నూతనంగా నిర్మించిన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్స్టేషన్ త్వరలోనే ప్రారంభం కానున్నది. యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాలకు చెందిన కొన్ని గ్రామాలు ఈ ఠాణా పరిధిలోకి రానున్నాయి. ఇక్కడ ఠాణా ఏర్పాటుతో నేరాలు తగ్గడంతోపాటు, అవాంఛనీయ, అసాంఠిక కార్యకలాపాలకు చెక్ పడనున్నది. ప్రస్తుతం ఎస్ఐ పరిధిలో స్టేషన్ కొనసాగుతుంది.. తర్వాత సీఐ పరిధిలోకి వెళ్తుంది.
-సీఐ లింగయ్య, యాచారం పోలీస్స్టేషన్