బడంగ్పేట: అల్మాస్గూడ బీజేపీ కార్పొరేటర్స్ కుటుంబ సభ్యులు పరస్పర దాడులు చేసుకున్నారు. గత కొంత కాలంగా అంతర్గతంగా ఉన్న విభేదాలు బోనాల సందర్భంగా బహిర్గతం అయ్యాయి. వివరాల ప్రకారం..బోనాల పండుగకు ప్లేక్సీలు ఏర్పాటు చేయాలని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ జనిగ పద్మ ఐలయ్య , 3వ డివిజన్ కార్పొరేటర్ రామిడి మాదురి వీర కర్ణారెడ్డి లు ఎవరికీ వారు నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్లే ఐలయ్య ఆయన కొడుకు అజయ్, వీర కర్ణారెడ్డి లు వేర్వేరుగా ప్లెక్సీలు కట్టడానికి వెళ్లిన సమయంలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. రోడ్డుపై కార్పొరేటర్ల భర్తలు తన్నుకోవడం చూసి ప్రజలు ముక్కుమీద వేలేసు కున్నారు. కాగా ఇరువురు ఒకరిపై ఒకరు మీర్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవడంతో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇద్దరు కార్పొరేటర్ల భర్తలు ఇలా తన్నుకోవడం చర్చనీయంశంగా మారింది.