వికారాబాద్ పట్టణ సమీపంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారిని దర్శించుకునేందుకు జనం బారులు దీరారు. కార్తికమాసాన్ని పురస్కరించుకొని ఆలయ ఆవరణలో మహిళా భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
దేవాలయ పరిసరాల్లోని అటవీ అందాలను ఆస్వాదించారు. ఇరువైపులా పచ్చని చెట్లు, మధ్యలో ఉన్న మెట్లపై భక్తుల రద్దీ నయనానందం కలిగించింది. స్వామివారి సన్నిధిలో.. ప్రకృతిని ఆస్వాదిస్తూ భక్తులు సరదాగా గడిపారు.