కొత్తూరు, అక్టోబర్ 9: జేపీ దర్గా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రూ.50 కోట్లతో దర్గా మాస్టర్ ప్లాన్కు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్తో దర్గా రూపురేఖలు మారిపోతాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హిందూముస్లిం అన్న భేదాలు లేకుండా అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ పేదలకు నష్టం జరుగొద్దనే ఉద్దేశంతోనే రెండుసార్లు మాస్టర్ ప్లాన్ను వాయిదా వేసినట్లు చెప్పారు. ఎంతోమంది పేదలు దర్గా వద్ద ఉపాధి పొందుతున్నారని.. వారికి అన్యాయం జరుగకుండా మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తామన్నారు. కాగా ముందుగా హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ జేపీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
గిరిజన గురుకుల పాఠశాల,కళాశాల భవనం ప్రారంభం
రూ. 4.20 కోట్లతో నిర్మించిన గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల భవనాన్ని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి హోంమంత్రి మహమూద్ ప్రారంభించారు. అదేవిధంగా రూ.5 కోట్లతో నిర్మించనున్న గురుకుల పాఠశాల/కళాశాల అదనపు గదుల నిర్మాణానికి కూడా వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అనంతరం ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి అన్ని వర్గాల పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ త్వరలోనే షాద్నగర్లో గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటు కానున్నదని.. దాని ద్వారా ఈ ప్రాంతంలోని గిరిజనులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీ శ్రీలత, వైస్ ఎంపీపీ శోభ, సర్పంచ్ అజయ్నాయక్, ఎంపీటీసీ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దేవేందర్యాదవ్, సత్యనారాయణ, మిట్టుయాదవ్, యాదగిరి, నారాయణరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, గోపాల్నాయక్, ఉప సర్పంచ్ శ్రీరాములు యాదవ్, వక్ఫ్బోర్డు అధికారులు పాల్గొన్నారు.