ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం రంగుల సంబురం అంబరాన్నంటింది. ఆదివారం రాత్రి కామదహనం చేయగా, సోమవారం తెల్లవారుజాము నుంచే రంగుల్లో మునిగితేలారు. కులమతాలకతీతంగా చిన్నాపెద్ద తారతమ్యం లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
పల్లెలు, పట్టణాల్లో డప్పుచప్పుళ్లతో ర్యాలీలు నిర్వహించగా, మహిళలు పాటలు పాడుతూ సంబురాలు జరుపుకొన్నారు. యువతీయువకులు డీజేలు, బ్యాండ్ చప్పుళ్ల మధ్య డ్యాన్స్లు చేస్తూ ఎంజాయ్ చేశారు. రంగుల్లో తడిసి ముైద్దెన తర్వాత మధుర జ్ఞాపకంగా ఉండాలని సెల్ఫీలు దిగారు. హోలీ వేడుకల్లో నాయకులు, ప్రజాప్రతిధులు, ఉద్యోగులు సైతం రంగుల సంబురాల్లో పాల్గొని సందడి చేశారు.