భారీ వర్షం ఉమ్మడి జిల్లాను ముంచెత్తింది. దీంతో రోడ్లు, పంట పొలాలు జలమయంగా మారాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారి అలుగు దుంకాయి. రహదారులపై నుంచి వరద పోటెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పత్తి, కంది, వరి తదితర పంటలు నీట మునిగాయి. కాగ్నా, ఈసీ, మూసీ నదులు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని పెద్ద ఉమ్మెంతాల్లో 12 సెం.మీటర్ల వర్షపాతం నమోదుకాగా, రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో 12.8 సెం.మీటర్లు నమోదైంది.
వికారాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): అంతేకాకుండా జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నా యి. మరోవైపు రాత్రంతా కురిసిన వర్షంతో కోట్పల్లి, లఖ్నాపూర్ ప్రాజెక్టులతోపాటు జిల్లాలోని మె జార్టీ చెరువులు అలుగు పారుతున్నాయి. అలాగే వాగులు పొంగిపొర్లడంతో తాండూరు, పెద్దేముల్, కుల్కచర్ల, ధారూరు మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు భారీ వర్షానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గుర య్యారు. కొడంగల్ పట్టణంలోని పాత చెరువు కట్ట తెగిపోవడంతో పట్టణంలోని పలు కాలనీలు జలమయం కావడంతో మున్సిపల్ చైర్మన్తోపాటు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అదేవిధంగా ధారూరు మండలం తరిగోపుల గ్రామంలో నూ లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోని వర్షపు నీరు చేరింది. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సంబంధిత అధికారులం తా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నిఖిల ఆదేశించారు. అదేవిధంగా పొంగిపొర్లుతున్న వాగులను ప్రజలు దాటకుండా ఆయా వాగుల వద్ద గస్తీ నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
రాష్ట్రంలోనే మూడో అత్యధిక వర్షపాతం జిల్లాలో నమోదైంది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు పూడూరు మండలంలోని పెద్ద ఉమ్మెంతాల్లో అత్యధికంగా 12 సెం.మీటర్ల వర్షపాతం నమోదైం ది. పరిగిలో 10.5 సెం.మీ, వికారాబాద్ మండలంలోని మద్గు ల్ చిట్టంపల్లిలో 10సెం.మీ, కొడంగల్లో 9.3 సెం. మీ, కుల్కచర్ల మండలంలోని ముజాహిద్పూర్లో 8.4 సెం.మీ, ధారూరులో 6.8 సెం.మీ, బొంరాస్పేటలో 6.2 సెం.మీ, యాలాలలో 5.9 సెం.మీ, యాలాల మండలంలోని దావలాపూర్లో 5.9 సెం.మీ, దుద్యాలలో 5.3 సెం.మీ, పరిగి మండలంలోని రాపోల్లో 4.3 సెం.మీ, కుల్కచర్ల మండలంలోని పుట్టపహాడ్లో 3.9 సెం.మీ, వికారాబాద్ మండలంలోని వికారాబాద్లో 3.5 సెం.మీ, నవాబుపేట మండలంలో 3.5 సెం.మీ, పెద్దేముల్లో 3.4 సెం.మీ, చౌడాపూర్ మండలంలోని చౌడాపూర్లో 3.2సెం.మీ, దౌల్తాబాద్లో 3 సెం. మీ, బషీరాబాద్ మండలంలోని కశీంపూర్లో 2.9 సెం.మీ, తాండూరులో 2.8 సెం.మీ, కోట్పల్లిలో 2.7 సెం.మీ, దోమలో 2.7 సెం.మీ, పూడూరు మండలంలోని మన్నెగూడలో 2.3 సెం.మీ, వికారాబాద్ మండలంలోని మదన్పల్లిలో 2 సెం.మీ టర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా గురువా రం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతానికి సంబంధించి…బంట్వారం మండలంలోని తొర్మామిడిలో 8.6 సెం.మీటర్లు, కోట్పల్లిలో 5.4 సెం.మీ, బొంరాస్పేటలో 4.9 సెం. మీ, ధారూరులో 4.2 సెం.మీ, పూడూరు మం డలంలోని మన్నెగూడలో 3.9 సెం.మీ, యాలాల మం డలంలోని యాలాలలో 2.8 సెం.మీ, దౌల్తాబాద్ లో 2.8 సెం.మీ, కొడంగల్ మండలంలోని కొడంగల్లో 2.7 సెం.మీ, వికారాబాద్ 1.8 సెం.మీ, వికారాబాద్ మండలంలోని మద్గుల్ చిట్టంపల్లిలో 1.4 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.
ధారూరు మండలంలోని నాగారం చిన్నవాగులో ఓ కారు కొట్టుకుపోయింది. వరద ఉధృతిని గమనించకుండా రోడ్డు దాటే ప్రయత్నంలో వరద ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత చెట్టు అడ్డుపడటంతో కారులో ఉన్న దోర్నాల్ గ్రామానికి చెందిన భార్యాభర్తలిద్దరూ చెట్టు కొమ్మను పట్టుకొని చెట్టు పైకెక్కి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో భార్యాభర్తలను రక్షించడంతోపాటు క్రేన్ సహాయంతో కారును బయటికి తీశారు.
రంగారెడ్డి, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ): జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల్లో కుండపోతగా వాన పడింది. ఆమనగల్లు మండలంలో 121.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, తలకొండపల్లి మండలంలో 86.4 ఎం.ఎంగా నమోదైంది. కేశంపల్లిలో 5 సెం.మీటర్లు, శంకర్పల్లి, కడ్తాల్, కందుకూరు మండలాల్లో 4 సెం.మీ, నందిగామ, బాలాపూర్, మాడ్గుల మండలాల్లో 3సెం.మీ, యాచారం, షాబాద్, చౌదర్గూడెం, కొందు ర్గు, కొత్తూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మంచాల అబ్దుల్లాపూర్మెట్, శేరిలింగంపల్లి మండలాల్లో 2సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. చేవెళ్ల, సరూర్నగర్, హయత్నగర్, రాజేంద్రనగర్, మొయినాబాద్, గండిపేట మండలాల్లో స్వ ల్పంగా కురిసింది. బుధవారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి జిల్లాలోని పలు చోట్ల చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. మరో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇబ్రహీంపట్నం రూరల్, అక్టోబర్ 6: బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే నిండుకుండలా మారిన చెరువులు, కుంటలు అలుగు పోస్తున్నాయి. ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు ప్రధానంగా నీరు అందించే పెద్దవాగు ఉధృతంగా ప్రవ హిస్తున్నది. ఎలిమినేడు, పోచారం, ఉప్పరిగూడ గ్రామాల మీదుగా జోరుగా పొంగుతున్న పెద్దవాగును చూసేందుకు ప్రజలు భారీగా త
రలి వస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని పొల్కంపల్లి నాగులమ్మ చెరువుతోపాటు రాయపోల్ చెరువు మత్తడి దూకుతున్నది. అలాగే, మండలంలోని పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిం డుకుండలా మారాయి. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం పెద్దవాగు, రాచకాల్వలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పెద్దచెరువుకు నీరు పెద్ద ఎత్తున చేరుతున్నది.