తలకొండపల్లి, డిసెంబర్24: మాదాయపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ మాదాయపల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్లతో కలిసి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ను కోరారు.
దీంతో స్పందించిన ఎమ్మెల్యే శనివారం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి ప్రొసీడింగ్ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలోని వివిధ గ్రామాల ముదిరాజ్లకు సంఘం భవనాల నిర్మాణాలకు నిధు లు ఇస్తానని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రామస్వామి, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.