తాండూరు, జనవరి 23: నేతాజీ సుభాష్చంద్రబోస్ జయంతిని సోమవారం తాండూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. తాండూరు పట్టణంతో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లోని గ్రామాలు, విద్యాలయాల్లో నేతాజీ విగ్రహానికి, చిత్రపటానికి రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, ఉపా ధ్యాయులు, విద్యార్థులు, యువకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాండూరు పట్టణం శాంత్మహాల్ చౌరాస్తాలోని బోస్ విగ్రహానికి ఎమ్మెల్యే రోహిత్రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘం నాయకులు, యువజన సంఘం ప్రతినిధులు, పోలీసులు, పాధ్యాయులు, విద్యార్థులు పూల మాలలు వేసి సెల్యూట్ చేస్తూ నివాళులర్పించారు. తాండూరులో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ నేతాజీని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజూగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పరిగి పట్టణంలో..
పరిగి టౌన్, జనవరి 23 : పరిగి పట్టణంలో బీఆర్ఎస్పార్టీ సీనియర్ నాయకుడు ప్రవీణ్ కుమార్రెడ్డి నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రవీంద్ర, రాఘవపూర్, చిగురాల్పల్లి సర్పంచ్లు జగన్, వెంకటయ్య, కోఆప్షన్ సభ్యుడు తాజూద్దీన్, నాయకులు అశోక్, మాణిక్యం పాల్గొన్నారు.
యాలాల: యాలాల మండల కేంద్రంలో ఎంపీపీ బాలేశ్వర గుప్తా నేతాజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోవిం దమ్మ, ఎంపీడీవో పుష్పలీల, ఎస్ఊ అరవింద్, ఎంఈవో సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
దేశానికి చేసిన సేవలు మరువలేనివి
మర్పల్లి, జనవరి 23 : నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఎస్సై అరుణ్కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని వివిధ గ్రామాలలో నేతాజీ జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. కోటమర్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ మండల ప్రధా న కార్యదర్శి రాచన్న గ్రామస్తులతో కలిసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూల మాలలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ రఘుపతి రెడ్డి, శ్రీశైలం, నర్సింహ పాల్గొన్నారు.
బొంరాస్పేట మండలంలో..
బొంరాస్పేట, జనవరి 23 : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని సోమవారం మం డలంలోని పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. నేతాజీ చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. గౌరారం ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం గోపాల్, విద్యార్థులు నేతాజీకి నివాళులర్పించారు.