ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 17 : ఎన్ని కుట్రలు చేసినా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని శపథం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యమనుకున్న పాలమూరు పథకాన్ని సుసాధ్యం చేసి చూపించారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకట్టపైగల పెద్దతూము వద్ద పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వైపు చూసిన దాఖలాలు లేవన్నారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేసినప్పటికీ కాళేశ్వరం తరహాలో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పూర్తి చేసిన ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును ప్రారంభించటం ఎంతో శుభసూచికమన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ప్రధాన చెరువులను నింపి వ్యవసాయానికి పుష్కలంగా సాగునీరు అందనుందన్నారు. ప్రభుత్వంపై విషం కక్కుతున్న ప్రతిపక్ష పార్టీలకు ఇది చెంపపెట్టులాంటిదన్నారు. పనిచేయటం చేతకాని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు పద్మ, మమత, విశాల, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు రాజు, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే, ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కృపేశ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం
మంచాల : తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మంచాల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో యువజన సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జగన్రెడ్డి, వార్డు సభ్యులు లింగం, యువజన సంఘాల సభ్యులు బాల్రాజ్ పాల్గొన్నారు.
ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. ఏఏంసీ కార్యాలయం దగ్గర ఏఎంసీ చైర్మన్ నాలపురం శ్రీనివాస్రెడ్డి జాతీయ జెండాను ఎగుర వేశారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యుడు నేనావత్ పత్యానాయక్ , ఏఎంసీ డైరెక్టర్లు రమేశ్ నాయక్, నర్సింహ్మ, లాయక్ అలీ, కాసుల కృష్ణయ్య, ఎంపీటీసీ దోనాదుల కుమార్, బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ ఖలీల్, చుక్క నిరంజన్ గౌడ్, పంతూనాయక్, అల్లాజీ, వెంకటేశ్, జంతుక కిరణ్, సతీశ్, రమేశ్, భాస్కర్, ఆనంద్, శివ, శేఖర్, చంటి, అమిర్ పాషా, మార్కెట్ కార్యదర్శి సరోజ పాల్గొనాల్నరు.