ఇబ్రహీంపట్నం బృందం, జూన్ 20 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయటంతో పాటు, ప్రైవేటుకు దీటుగా విద్యార్థులకు వసతులు కల్పించటానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఇబ్రహీంపట్నం మండలంలోని చర్లపటేల్గూడ, మంచాల మండలంలోని నోముల గ్రామంలోని పాఠశాలల్లో జరిగిన విద్యా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయటానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలతో నాడు నేడు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. గతంలో తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించటానికి ఉత్సాహం చూపించే తల్లిదండ్రులు, నేడు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులతో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారని వివరించారు. చర్లపటేల్గూడలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, వైస్ఎంపీపీ ప్రతాప్రెడ్డి, ఎంపీటీసీలఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్రెడ్డి, సర్పంచ్ గీతారాంరెడ్డి, ఎంపీటీసీ ఆంజనేయులు, రైతుబంధు గ్రామ కోఆర్డినేటర్ కంబాలపల్లి హన్మంత్రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ హరిప్రసాద్గౌడ్, ఆర్డీవో వెంకటాచారి, ఎంఈవో వెంకట్రెడ్డి పాల్గొన్నారు. నోములలో జరిగిన విద్యా దినోత్సవానికి ఎంపీపీ నర్మద, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, సహకారసంఘం చైర్మన్ పుల్లారెడ్డి, ప్రముఖ సంఘ సేవకులు హరికిషన్, గ్రామ సర్పంచ్ బాలరాజు, హెచ్ఎం రాజిరెడ్డి, తహసీల్దార్ అనిత, విద్యా కమిటీ చైర్మన్ జగన్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నల్లకంచ బాలికల పాఠశాలలో మంగళవారం విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు ప్రసన్నలక్ష్మి, జగన్ తదితరులు పాల్గొని విద్యార్థులకు యూనిఫాం, నోటుపుస్తకాలు అందజేశారు. అలాగే, శేరిగూడ, ఇబ్రహీంపట్నం ఉన్నత పాఠశాలల్లో విద్యాదీవెన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఉప్పరిగూడ, పోచారం, కప్పాడు, ఎలిమినేడు, తుర్కగూడ, తులేకలాన్, రాయపోల్, ముకునూరు, దండుమైలారం, పోల్కంపల్లి, నెర్రపల్లితో పాటు పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాదీవెన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎలిమినేడు ఉన్నత పాఠశాలలో ఎంపీపీ కృపేశ్, వైస్ఎంపీపీ ప్రతాప్రెడ్డి విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు అందజేశారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, షూ, టైబెల్టులను అందజేశారు.
యాచారం : కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని ఎంపీపీ సుకన్య ప్రారంభించారు. పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగమ్మ, సర్పంచ్ హబీబ్, ఉపసర్పంచ్ జగన్, ఎంపీటీసీ సుమతమ్మ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేట్ : పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు ఉన్నత పాఠశాలల్లో కౌన్సిలర్ హరిశంకర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు అందజేశారు.
మంచాల : మంచాల మండలంలోని మంచాల, జాపాల, ఆరుట్ల, లోయపల్లి, బండాలేమూర్, ఆగాపల్లి, నోములతో పాటు పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సర్కారు బడులకు ..
షాబాద్: విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్లలో నిర్వహించిన విద్యా దినోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అదే విధంగా షాబాద్ మండలంలోని కక్కులూర్, అంతారం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన విద్యా దినోత్సవంలో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి పాల్గొని మన ఊరు-మన బడి కార్యక్రమంలో అభివృద్ధి చేసిన పాఠశాల గదులను ప్రారంభించారు. మొయినాబాద్ మండలం నాగిరెడ్డిగూడలో నిర్వహించిన విద్యా దినోత్సవంలో జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం పాల్గొని విద్యార్థులకు ఆట వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు మర్పల్లి మాలతి, కాలె శ్రీకాంత్, గోవిందమ్మ, ఎంపీపీలు విజయలక్ష్మి, గునుగుర్తి నక్షత్రం, గోవర్ధ్దన్రెడ్డి, ఎంపీడీవోలు అనురాధ, రాజ్కుమార్, సంధ్య, వెంకయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు మమతారెడ్డి, యాదమ్మ, నరోత్తంరెడ్డి, లక్ష్మమ్మ, సురేందర్, రవీందర్గౌడ్, ఎంపీటీసీ మంగళి కరుణాకర్, అర్జున్, మాజీ ఎంపీటీసీ జీవన్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు ప్రభాకర్, మహేందర్రెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల విద్యార్థులకు గురుకులాలు
షాద్నగర్/నందిగామ : కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా సర్కారు విద్య అందుతున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ. రాయికల్, కాశీరెడ్డిగూడ, అన్నారం గ్రామాల్లో నిర్వహించిన విద్యాదినోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల నిధులను సర్కారు విద్యకు వెచ్చిస్తున్నదని తెలిపారు. నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాలలతో పాటు కేజీబీవీ పాఠశాలను ఏర్పాటు చేశామని వివరించారు. నూతనంగా పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిధులను కేటాయించిందని, త్వరలోనే కళాశాల ప్రారంభమవుతుందని చెప్పారు. లింగారెడ్డిగూడ గ్రామంలో నూతన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. కాశీరెడ్డిగూడ, లింగారెడ్డిగూడ, రాయికల్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ యూనిఫాంలను అందజేశారు. నందిగామ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో సర్పంచ్ జిల్లెల వెంకట్రెడ్డి సొంతో ఖర్చులతో ఏర్పాటు చేసిన సరస్వతీ దేవి విగ్రహానికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. విద్యార్థుల దాహార్తిని తీర్చడానికి ప్రముఖ వ్యాపారవేత్త తాండ్ర గోపాల్రెడ్డి సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం నందిగామ ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో ఆరోగ్య లక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బక్కన్నయాదవ్, ఎంఈఓ శంకర్రాథోడ్, ఎంపీడీవో వినయ్కుమార్, ఎంపీపీ ప్రియాంకగౌడ్, ఉప సర్పంచ్ కుమార్గౌడ్, ఎంపీటీసీలు చంద్రపాల్రెడ్డి, కృష్ణ, కుమారస్వామి, విద్యా కమిటీ చైర్మన్ రాములు పాల్గొన్నారు.
పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట
కేశంపేట : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన విద్యా దినోత్సవంలో ఎంపీపీ రవీందర్యాదవ్, జడ్పీటీసీ విశాల పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో నిరుపేదలు, అణగారిన వర్గాల పిల్లల చదువుల కోసం ప్రభుత్వం గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేసి వారికి విద్యనందిస్తున్నదన్నారు. కేశంపేట, కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ సిస్టమ్స్ను ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, తహసీల్దార్ ఆజం అలీ, ఇన్చార్జి ఎంఈవో మనోహర్, ఇన్చార్జి ఎంపీడీవో రవిచంద్రకుమార్రెడ్డి, సర్పంచ్లు నవీన్కుమార్, వెంకట్రెడ్డి, జీహెచ్ఎం రసూల్ పాల్గొన్నారు.
చిరుధాన్యాల ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం
మొయినాబాద్ : చిరుధాన్యాల ఆహారాన్ని ప్రతి ఒక్కరూ అలబాటు చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ డీకే లక్ష్మీరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కనకమామిడి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోలీస్ శాఖ వారు సామాజిక వేత్త అంజన్కుమార్గౌడ్ సౌజన్యంతో విద్యార్థులకు మిల్లెట్స్ ఆహారం ఏర్పాటు చేయించారు. కార్యక్రమంలో ఎస్ఐలు ప్రణయ్తేజ, శిరీష, నాయకులు ప్రకాశ్, గణేశ్రెడ్డి, పద్మనాభం, మధుసూదన్రెడ్డి, నర్సింహారెడ్డి, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.
అదనపు గదులు, డిజిటల్ తరగతులు ప్రారంభం
కడ్తాల్ : ప్రభుత్వ పాఠశాలలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో విద్యా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధులగుండా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కడ్తాల్ గ్రామంలోని బాలుర, బాలికల ప్రాథమికోన్నత పాఠశాలల్లో రూ.30 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను, జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, విద్యార్థులకు అల్పాహారంగా అందిస్తున్న రాగిజావను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలుర ఉన్నత పాఠశాలలో హెచ్ఎం జంగయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో నియోజకవర్గంలో మొదటి విడుతలో ఎంపిక చేసిన 108 పాఠశాలల్లో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కడ్తాల్ గ్రామంలోని బాలుర ఉన్నత పాఠశాల ప్రహరి నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులకు దుస్తులు, పాఠ్య పుస్తకాలను అందజేసి వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్గుప్తా, ఉప సర్పంచ్ రామకృష్ణ, వార్డు సభ్యులు నరేందర్రెడ్డి, భిక్షపతి, చందోజీ, నర్సింహ, జహంగీర్అలీ, రాజేందర్, మహేశ్, ఎస్ఎంసీ చైర్మన్లు చందర్, జగన్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆమనల్లు : ఆమనగల్లు లోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేసి, డిజిటల్ తరగతులను ప్రారంభించారు. విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రాంపాల్నాయక్, దుర్గయ్య, కౌన్సిలర్లు లక్ష్మణ్, చెన్నకేశవులు, ఎస్ఏంసీ చైర్మన్ ప్రభావతి, ఉపాధ్యాయులు ఉన్నారు.
తలకొండపల్లి : వెల్జాల్ గ్రామంలో విద్యాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లో నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ముజీబూర్ రెహ్మాన్, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మాడ్గుల :మండలంలో విద్యాదినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నల్లచెరువు గ్రామంలోని పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, హెచ్ఎం ఓంకేశవరెడ్డి, యాదగిరిరెడ్డి, పాఠశాల చైర్మన్ అంజయ్య పాల్గొన్నారు.