కొండాపూర్, ఫిబ్రవరి 27 : చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ఐటీ ఉద్యోగులు తమ వంతు సహకారమందిస్తున్నారని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తౌటం అన్నారు.
తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కౌన్సిల్ (టీఎఫ్ఎంసీ) ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు చేయూతనిచ్చే కార్యక్రమాలలో భాగంగా మాదాపూర్లోని టీ – హబ్లో మూడు రోజుల చేనేత వస్త్ర ప్రదర్శనను ఆమె సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఐటీ ఉద్యోగులు ప్రతి సోమవారం చేనేత వస్ర్తాలు ధరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్ఎంసీ అధ్యక్షులు ఎం సత్యనారాయణ మతాల పాల్గొన్నారు.