షాద్నగర్టౌన్ : తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళశాలలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్ష గడువు ఈ నెల 19వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ నీతా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షకు గాను ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులందరూ ఈ నెల 19లోపు www.tgtwgurukulam, telangana.gov.inద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.