తాండూరు, జనవరి 20 : వికారాబాద్ జిల్లా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి 2023-24 సంవత్సరానికి ఆన్లైన్లో అర్హులైన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల అధ్యాపకులు కోరారు. కళాశాల అధ్యాపకులు మౌనిక, సంధ్య, మానస శుక్రవారం తాండూరులోని ఓ కళాశాలలో పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కళాశాలలకు వెళ్లి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థినులకు వివరించారు. బాలికల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కళాశాలలో చదువుకోవాలనుకునే వారు ఫిబ్రవరి 5వరకు అన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మార్చి 5న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. గురుకుల కళాశాలలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థినులకు నోట్బుక్స్, ప్రాక్టికల్ రికార్డ్స్, యూని ఫాం, ఇతర డ్రెస్సులు, బ్యాగు, నిత్యావసర వస్తువులకు నెలకు రూ.140తో పాటు నాణ్యమైన భోజనం, తదితర సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన, జీవితంలో ఎదిగేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేయనున్న విద్యార్థులందరూ అన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.