పరిగి, జూన్ 16: మున్సిపాలిటీలు అభివృద్ది విషయంలో నగరాలతో పోటీ పడు తు న్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం అమలుతో మున్సిపాలిటీలు స్వచ్ఛ పట్టణాలుగా మారాయన్నారు. దేశ వ్యాప్తంగా స్వచ్ఛ పట్టణాలకు ఇచ్చే అవార్డులు తెలంగాణలోని పట్టణాలకు వస్తున్నాయంటే అభి వృద్ధిలో మొదటి వరుసలో నిలవడమే కారణమన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పరిగిలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణ లో నిర్వహించిన పట్టణ ప్రగతి ఉత్సవాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో 63 మున్సి పాలి టీలు ఉం డగా 123 మున్సిపాలిటీలకు పెంచడంతోపాటు నగరాలకు దీటుగా చిన్న పట్టణాలను అభివృద్ది చేస్తున్న ఘనత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు దక్కుతుం దన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని పరిగి పట్టణాభివృద్దికి రూ. 15కోట్లు మం జూరు చేయగా పనులు తుది దశలో ఉన్నాయన్నారు.
పరిగి పట్టణానికి మరో రూ.25 కోట్లు ఇచ్చేందుకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారన్నారు. మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో రూ.21.30కోట్లు వెచ్చించి అభివృద్ది పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి 9 రకాల వస్తువులు అందజేశారు. అనంతరం పలువురిని మున్సిపల్ చైర్మ న్ సన్మా నించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, పశుసంవర్దక శాఖ అధికారి డాక్టర్ అనిల్, ఎంపీపీ అరవిందరావు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కె.ప్రసన్నలక్ష్మి, ఎంపీడీవో శేషగిరిశర్మ, తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధి కారి ప్రియదర్శిని, కౌన్సిలర్లు అర్చన, ఎదిరె కృష్ణ, వెంకటేశ్, వారాల రవి, నాగేశ్వర్, కో-ఆప్షన్ సభ్యుడు ముకుంద శేఖర్, బీఆర్ఎస్ నాయకులు మౌలానా, రవికుమార్, తాహెర్అలీ పాల్గొన్నారు.
రూ.42కోట్లతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు
కొడంగల్, జూన్ 16: మున్సిపల్ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిం చారు. మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించగా ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు అధికారులు గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలన ప్రజలకు చేరువ కావాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కొత్త జిల్లాలను, మండ లాలను, మున్సిపాలిటీలను, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో 14 నియోజకవర్గాలకు ఓ కలెక్టర్ కార్యాలయం అందుబాటులో ఉండేదని, నేడు నాలుగు నియోజకవర్గాలకు ఓ కలెక్టర్ కార్యాలయం ఏర్పడిందన్నారు.
కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్, కోస్గి రెండు పట్టణాలు మున్సిపాలిటీలుగా ఏర్ప డ్డాయన్నారు. కొత్తగా ఏర్పడిన రెండు మున్సిపాలిటీల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించి కోట్లాధినిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. కొడంగల్ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు రూ.42కోట్ల మేరకు అభివృద్ధి పనులు జరిగినట్లు వివరించారు. రూ.కోటి 50లక్షలతో మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణం, రూ. 10లక్షలతో పార్క్, పెద్ద చెరువు మరమ్మతులకు రూ.కోటి 60 లక్షలు, రూ. కోటి నిధులతో వైకుంఠధామ నిర్మాణం, వార్డుల్లో సీసీ రోడ్లుకు రూ.12కోట్ల, 50లక్షలు, రూ.50లక్షలతో డంపింగ్ యార్డ్ వంటి ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 3 నర్సరీల్లో మొత్తంగా 44వేల మొక్కల పెంపకం జరు గుతున్నదన్నారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా పట్టణంలో మొత్తంగా 2.50 ఎం ఎల్డీ నీటి సరఫరా అవుతున్నదన్నారు. మున్సిపాలిటీ పరధిలోని మొత్తం 14,294 జనాభాకు గాను 732మంది వీధి వ్యాపారులను గుర్తించి రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. 50 పడకల ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిందని, ఆసుపత్రిలో రోగుల విశ్రాంతికి గాను రూ.50లక్షలతో షెడ్, కంపౌండ్వాల్, మార్చురీ గది నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. కేటీఆర్ కొడంగల్ను దత్తత తీసుకొని రూ.42కోట్లపైగా నిధులతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. అనంతరం మున్సిపాలిటీ కార్మికులకు, మెప్మా సభ్యులకు, మున్సిపాలిటీ సిబ్బందికి వారి నైపుణ్యాన్ని బట్టి ఉత్తమ అవార్డులను అందజేశారు. అదేవిధంగా మహిళా సంఘాలకు రూ.50లక్షల రుణానికి సంబంధించి చెక్కును అందజేశారు. కొడంగల్ మున్సిపాలిటీ ఉత్తమ మున్సిపాలిటీగా ఎంపికైం దని, గతంలో కోస్గి మున్సిపాలిటీకి ఉత్తమ అవార్డు వచ్చినట్లు గుర్తుచేశారు. కార్యక్ర మంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, వైస్ చైర్పర్సన్ ఉషారాణి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులతో పాటు డీఆర్డీఏ పీడీ కృష్ణణ్, మున్సిపల్ కమీషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి
తాండూరు, జూన్ 16: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్ర వారం తాండూరు మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ వాహనాలు, కళాకారుల నృత్యాలతో మున్సిపల్ పాలక వర్గం నేతలు తాండూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ చౌరాస్తాలో జయశంకర్సార్కు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజూగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీపతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కార్మికులను, అధికారులు సన్మానిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రగతి ప్రజలకు వరం అన్నారు. రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. సీమాంధ్ర పాలనలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని అన్నారు. వెనుక బడిన తాండూరు అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకు వచ్చినట్లు తెలిపారు. తాండూరులో రోడ్ల విస్తరణ చేపట్టి రోడ్డు వేయడంతో కాలుష్యం తగ్గిం దన్నారు. మున్ముందు మరింత అభివృద్ధి చేయుటకు ప్రత్యేక ప్రణాళిక చేపట్టినట్లు తెలిపారు