యాలాల, డిసెంబర్ 5: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన బాకారం హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం కనుల పండువగా సోమవారం భక్త జనుల మధ్య నిర్వహించారు. యాలాల మం డలం హాజీపూర్ గ్రామ సమీపంలో కొలువుదీరిన హనుమాన్ దేవాలయం పురాతనమైనదే కాదు మహిమాన్వతమైనది. విగ్రహదాత అయిన యా లాల మండల కేంద్రానికి చెందిన పెండ్యాల నారాయణ గుప్తా, ఎంపీపీ బాలేశ్వరగుప్తా, సర్పంచ్ వొంగోనిబాయి శ్రీనివాస్తో కలిసి ప్రారంభిం చారు. తాండూరు మురుగన్ సన్నిధానం స్వాములు, సాయి భజన మం డలి శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం నిర్వహించిన శోభాయాత్ర పుర వీధులగుండాసాగింది. స్వాముల ఆటపాటలతో సుమధుర సంగీత వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కొనసాగింది. మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతుతో స్వామివారికి స్వాగతం పలికారు.