పెద్దేముల్, నవంబర్ 14 : వికారాబాద్ మున్సిపాలిటీ గంగారంలోని 3.5 ఎకరాల ప్రభుత్వ భూమికి సోమవారం బహిరంగ వేలం నిర్వహించగా భారీ స్పందన లభించింది. ప్రభుత్వ ప్రారంభ ధర ఎకరానికి రూ.55 లక్షలుగా నిర్ణయించారు. వేలంలో హైదరాబాద్కు చెందిన ‘జాయ్ వెంచర్స్’ వారు అత్యధికంగా ఎకరానికి రూ. కోటీ ఆరు లక్షల చొప్పున 3.5 ఎకరాలను చేజిక్కించుకున్నారు.
బహిరంగ వేలంలో సుమారు 40 మంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అనంతరం భూమిని దక్కించుకున్న ‘జాయ్ వెంచర్స్’ వారికి కలెక్టర్ నిఖిల, అదనపు కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి ధ్రువపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఆర్డీవో విజయ్కుమారి, రాజీవ్ స్వగృహ జనరల్ మేనేజర్ నరేందర్రెడ్డి, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ శ్రావణ్ పాల్గొన్నారు.