కడ్తాల్, జూలై 27 : నిరుపేదల ఆరోగ్యానికి టీఆర్ఎస్ సర్కార్ భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని చరికొండ గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు యాదయ్యకి రూ.2,50,000 (ఎల్వోసీ) ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు ఎమ్మెల్యే సహకారంతో మంజూరైంది.
బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారురాలి కుటుంబ సభ్యుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకందరికి వరంలా మారిందన్నారు.
ఈ పథకం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాప నరేశ్, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు నరేశ్గౌడ్, నాయకులు పెద్దయ్య, మహేశ్ పాల్గొన్నారు.