తాండూరు, నవంబర్ 28: తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శమని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణం తో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడంతో ప్రజలు మెరు గైన జీవితం గడుపుతున్నారని పేర్కొన్నారు. గడిచిన ఏడున్నరేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలోని ఏ రాష్ట్రంలో జరగలేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు ఇవ్వడంతో తాండూరు నియోజకవర్గంలో అభివృద్ధి దూసు కుపోతుందన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయన్నారు. వెనుక బడిన కులాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ప్రజల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టినట్లు తెలిపారు.ఇండ్లు లేని ప్రజలకు డబుల్ బెడ్రూంతో పాటు జీవన ప్రమాణాలు పెం పొందించుకొనుటకు వడ్డీ లేని రుణాలు, సబ్సిడీ పథకాలు ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. అనంతరం తాండూరు అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకు వచ్చిన ఎమ్మెల్యే రోహిత్రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజూగౌడ్, ఎంపీపీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.