పరిగి, డిసెంబర్ 31 : విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగిలోని తమ నివాసంలో ఎస్టీయూటీఎస్-2023 క్యాలెండర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నదన్నారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అమలుతో విద్యార్థులకు చక్కటి బోధన అందుతున్నదన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో పరిగి, పూడూరు ఎంపీపీలు అరవిందరావు, మల్లేశం, మున్సిపల్ చైర్మన్ అశోక్, టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, ఎస్టీయూటీఎస్ రాష్ట్ర కౌన్సిలర్లు బసిరెడ్డి, ఎం.డి.షఫీ, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు.
మిట్టకోడూరు శివాలయంలో షెడ్డు నిర్మాణం
అంతకుముందు కులకచర్ల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన నేనావత్ బాలూనాయక్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పొందడంతో ఆయనను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సన్మానించి అభినందించారు. అనంతరం పరిగి మండలం మిట్టకోడూర్ గ్రామంలోని శివాలయంలో ఎమ్మెల్యే పూజలు చేశారు. ఎమ్మెల్యే తన సొంత డబ్బులతో ఆలయంలో భక్తులు కూర్చోవడానికి వీలుగా షెడ్డు నిర్మాణం చేయించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
దోమ మండలం గూడూరు గ్రామానికి చెందిన పెంటారెడ్డికి సీఎం సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే మహేశ్రెడ్డి శనివారం పరిగిలో అందజేశారు. కార్పొరేట్ వైద్యం చేయించుకున్న వారికి ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహకారం అందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో దోమ మండల వైస్ ఎంపీపీ మల్లేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్గౌడ్ పాల్గొన్నారు.