వికారాబాద్, జనవరి 6 : టీఎస్ ఐపాస్ (తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ప్రాజెక్టుల మంజూరు ప్రక్రియ కింద దరఖాస్తులు చేసుకున్న 1,123 యూనిట్లకు స్క్రూట్నీ చేసి 970 యూనిట్లకు కమిటీ ఆమోదించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో 3 ఎస్సీ, 10 మంది ఎస్టీ లబ్ధిదారులకు వాహనాల కొనుగోలుపై 35శాతం సబ్సిడీతో రూ.40,60,549లు మంజూరు చేసినట్లు తెలిపారు.
ముగ్గురు ఎస్సీ లబ్ధిదారులకు రూ.8,36,652లు ఆమోదించగా, 10 మంది ఎస్టీ లబ్ధిదారులకు రూ.32,29,897లు సబ్సిడీని మొత్తం 13 మందికి రూ.40,60,549లు సబ్సిడీని కమిటీ ఆమోదించిందన్నారు. మరో 95 దరఖాస్తులను వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు పేర్కొన్నారు. మిగతా దరఖాస్తులు వివిధ దశల్లో పరిశీలనలో ఉన్నాయన్ని వివరించారు.
ఈ యూనిట్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వినయ్కుమార్, వెహికిల్ ఇన్స్పెక్టర్ జోసెఫ్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోఠాజీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజస్, ఎల్డీఎం రాంబాబు, భూగర్భ జల శాఖ అధికారి దీపరెడ్డి పాల్గొన్నారు.