గీత కార్మికులకు రూ.5లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించడంతో ఉమ్మడి జిల్లాలోని గౌడన్నలు సంబురాలు చేసుకుంటున్నారు. గురువారం గీత కార్మిక సంఘాల నాయకులు, గౌడ కులస్తులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. షాద్నగర్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొనగా.. కడ్తాల్, కోట్పల్లిలలో ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో గీత కార్మికులు సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. పలుచోట్ల పాపన్నగౌడ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
షాద్నగర్రూరల్, మే 4 : గౌడన్నల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం గౌడ సంఘం నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి సిద్ధమైన, స్వచ్ఛమైన నీరాను రాష్ట్ర ప్రజలకు అందిస్తూ గౌడన్నల ఆర్థిక ఎదుగుదల కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. రైతు బీమా తరహాలోనే ప్రతి గౌడ కులస్తులకు అండగా నిలచేలా రూ.5లక్షల బీమాను ప్రకటించి కేసీఆర్ గౌడన్నలలో మరింత భరోసా నింపారన్నారు. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులకు ప్రతి నెలా రూ.2016 పింఛను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. దీంతో పాటు మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ సామాజిక వర్గానికి 15శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. కల్లు దుకాణాల నెలవారి కిస్తు, తాటి, ఈత చెట్ల పన్ను రద్దు చేసినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
గీత కార్మికులకు రూ.5లక్షల బీమా వర్తింపుతో పాటు, నీరా స్టాల్ను ఏర్పాటు చేయడం పట్ల గౌడ సంఘం నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, నాయకులు నారాయణరెడ్డి, గౌడ సంఘం నాయకులు శివరాములు, ప్రకాశ్, శివలింగం, శ్రీనివాస్, రాములు, రామస్వామి, శ్రీనివాస్, ఆంజనేయులు, మారుతి, రవి, వెంకటేశ్, శేఖర్, శ్రీశైలం, దర్శన్, జగన్ పాల్గొన్నారు.
గీత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట
కడ్తాల్ : గీత కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీటను వేస్తున్నదని గౌడ సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు, బీఆర్ఎస్ నాయకుడు లాల్కోట నర్సింహాగౌడ్, సర్పంచ్ భారతమ్మ అన్నారు. గౌడ కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా సౌకర్యం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ, గురువారం మండల పరిధిలోని చరికొండ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి గౌడ కులస్తులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేత నర్సింహాగౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కుల వృత్తులతోపాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నగరంలోని ట్యాంక్బండ్ సమీపంలో నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు గౌడ కులస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు జంగయ్యగౌడ్, గోపాల్గౌడ్, అనిల్గౌడ్, లాలయ్యగౌడ్, కృష్ణయ్యగౌడ్, వెంకటయ్యగౌడ్, గోపాల్గౌడ్, భూపాల్గౌడ్, శంకరయ్యగౌడ్, సత్తయ్యగౌడ్, ముత్యాలుగౌడ్, శ్రీనివాస్గౌడ్, చంద్రయ్యగౌడ్, మల్లయ్యగౌడ్, సాబేర్ పాల్గొన్నారు.
గౌడన్నలకు జీవితబీమా హర్షణీయం
కోట్పల్లి : అన్ని వర్గాల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై గౌడన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద గీత కార్మికులకు జీవిత బీమాను ప్రకటించడంపై గీత కార్మికులతో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు, సంఘాలకు ఆర్థిక అభివృద్ధిని సాధించుకునేందుకు అవకాశాలను కల్పిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మహేష్గౌడ్, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్గుప్తా, సమ్మయ్య, కృష్ణ, అన్వర్, రవీందర్గౌడ్, నర్సింహులు పాల్గొన్నారు.