పూడూరు : జాతీయస్థాయి కరాటే పోటిలో వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల గ్రామానికి చెందిన జాజుల వైష్ణవి బ్లాక్బెల్ట్ సెకండ్ డావున్లో గోల్డ్ మెడల్, ఛాంపియన్షిప్ సాదించింది. హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో వైఎస్ఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో కియా జపాన్ షోటోకన్ కరాటే అసోసియేషన్ జాతీయస్థాయి పోటీలు కొనసాగయి. అందులో వైష్ణవి గోల్డ్ మెడల్ సాదించినట్లు కరాటే అసోసియేషన్ ఇండియన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆత్మ సంరక్షణతో పాటుగా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలన్నారు.
ప్రతి ఒక్కరు చిన్న వయస్సు నుంచే కరాటే నేర్చుకుంటే ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. ఈ పోటిల్లో ఆయా మెడల్స్ సాదించిన ఎండి. మహబుబ్, అభిషేక్, రిషీ, సిహెచ్. వర్షిత, సాయిచరణ్, సునశ్వని, అక్షమా తదితరులు ఉన్నట్లు తెలిపారు.