షాద్నగర్టౌన్, సెప్టెంబర్ 28 : షాద్నగర్లో భక్తిశ్రద్ధలతో వైభవంగా పూజలు అందుకున్న గణపయ్యాలు గురువారం రాత్రి గంగమ్మ చెంతకు చేరారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపులో భాగంగా షాద్నగర్ పట్టణంలో నిర్వహించిన గణేష్ నిమజ్జన ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. పదుల సంఖ్యలో గణనాథులను ఊరేగించి తమ భక్తిని చాటారు. పట్టణ పుర వీధులన్నీ గణపయ్య భక్తులతో కిటకిటలాడాయి. బొజ్జ గణపయ్యలను తిలకించేందుకు వందలాది భక్తులు తరలివచ్చారు. డప్పువాయిధ్యాల మధ్య గణనాథుల ఊరేగింపు వైభవంగా సాగింది. ఏసీపీ రంగస్వామి ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. అంతేకాకుండా మున్సిపాలిటీలోని బొబ్బిలి చెరువు, ఫరూఖ్నగర్ మండలం బుచ్చిగూడ పరిధిలోని పెరుమాళ్లు కుంట వద్ద విద్యుత్ దీపాలతో పాటు భారీ క్రేన్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు గణేష్ మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగానే పట్టణంలోని శ్రీ శివమారుతిగీతా అయ్యప్ప మందిరంలో హరిద్రగణపతి అలంకరణలో స్వామివారు దర్శనమిచ్చారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు, కాలేజీరోడ్డు భగత్యూత్ సభ్యులు గణనాథుడిని ఊరేగింపు నిర్వహించారు. పలుచోట్ల నిర్వహించిన ఉట్ల కార్యక్రమంలో చిన్నారులు, యువత ఉత్సాహంతో పాల్గొని నృత్యాలు చేశారు.
తుర్కయాంజాల్లో
తుర్కయాంజాల్ : తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి మాసాబ్ చెరువులో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. నిమజ్జనం కోసం మాసాబ్ చెరువు వద్ద మున్సిపాలిటీ అధికారులు భారీ ఏర్పాట్లను చేశారు. అబ్ధుల్లాపూర్మెట్ మండలం ఆరోగ్యం కేంద్రం వారు మాసాబ్ చెరువు వద్ద క్యాంపును ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో గణనాథులను మాసాబ్ చెరువులో నిమజ్జనం చేశారు.
మేడిపల్లిలో..
యాచారం : మండల పరిధిలోని బొల్లిగుట్టతండాలో లడ్డూ వేలం పాటలో రూ.1,65,000లకు నందివనపర్తి మాజీ సర్పంచ్ రాజునాయక్ దక్కించుకున్నాడు. తాటిపర్తి అనుబంధ గ్రామం గొల్లగూడలో రూ.80,000లకు చిరంజీవి సొంతం చేసుకున్నాడు. బ్యాండు మేళాల మధ్య నృత్యాలు చేస్తూ కన్నుల పండువగా వినాయకుడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు.
ఇనాంగూడ పరిధిలో
అబ్దుల్లాపూర్మెట్ : ఇనాంగూడ గ్రామపంచాయతీ పరిధిలోని భైరంఖాన్ చెరువులో గణనాథులను భక్తులు నిమజ్జనం చేశారు. ఎల్భీనగర్, వనస్థలిపురం, హయత్నగర్ నాగోల్, ఆటోనగర్, మండల పరిధిలొని గ్రామాల్లో నెలకొల్పిన గణనాధులు నిమజ్జనానికి తరలివచ్చాయి.
ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ సాయిశ్రీ
అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇనాంగూడ భైరంఖాన్ చెరువులో నిమజ్జన ఏర్పాట్లను ఎల్భీనగర్ డీసీపీ సాయిశ్రీ, వనస్థలిపురం ఏసీపీ ఎస్ భీంరెడ్డితో కలిసి పరిశీలించారు. ఏర్పాట్ల వివరాలను సీఐ మన్మోహన్ను అడిగి తెలుసుకున్నారు.
వారి వెంట ఎస్ఐలు కరుణాకర్రెడ్డి, సునీల్కుమార్, కిషన్నాయక్, సిబ్బంది ఉన్నారు.
నల్లచెరువులో
మాడ్గుల : మండలంలోని నల్లచెరువు గ్రామంలో నిమజ్జనం కార్యక్రమం ప్రజలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు కట్ట జంగయ్య, మహేశ్, శివ, సంజీవ, కాశి, ఉటు యాదయ్య, అంజయ్య, యాదయ్య, శేఖర్ పాల్గొన్నారు.
మంచాల: మంచాల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన లడ్డూ వేలం పాటలో మంచాలకు చెందిన దాచిరెడ్డి మహేందర్రెడ్డి రూ. 1.57లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నారు.
మొయినాబాద్ : మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామంలో వినాయక విగ్రహాలను నిమజ్జనానికి సామూహికంగా తరలించారు. మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామంతో పాటు అనుబంధ గ్రామమైన జీవన్గూడ గ్రామంలోని వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. మహా గణపతి విగ్రహం లడ్డూను ఎల్ఐసీ రామచంద్రారెడ్డి టీం రూ.5.25 లక్షలకు కైవసం చేసుకున్నారు. జీవన్గూడ గ్రామంలోని వినాయకుడి లడ్డూను కుమ్మరి సత్తయ్య రూ.2.60 లక్షలకు కైవసం చేసుకున్నారు. అనంతరం గండిపేట చెరువులో నిమజ్జనం చేశారు.
కడ్తాల్: మండల పరిధిలోని గడ్డమీదితండాలో నిర్వహించిన వినాయక లడ్డూ వేలం పాటలో యువకులు రూ.1, 67,000లకు దక్కించుకున్నారు. కడ్తాల్ పట్టణంలోని బీసీ, టెలిఫోన్ ఎక్సైంజ్ కాలనీల్లో అన్నదాన చేశారు. అనంతరం గణనాథులను చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, రైతుబంధు సమితి గ్రామాధ్యక్షుడు నర్సింహ పాల్గొన్నారు.
ముద్దెంగూడలో అన్నదానం
షాబాద్, సెప్టెంబర్ 28 : షాబాద్ మండల పరిధిలోని ముద్దెంగూడ గ్రామంలో వినాయకుడికి ముద్దెంగూడ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కుర్వ జయమ్మ, సహకార సంఘం డైరెక్టర్ పి. నర్సింహులు, గ్రామస్తులు వెంకటయ్య, పాపిరెడ్డి, సుదర్శన్, లింగం, శంకర్, సుధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.