తలకొండపల్లి : తలకొండపల్లి మండలంలోని వెల్జాల్ గ్రామంలో ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ముదిరాజ్ నిధుల నుంచి రూ. 4లక్షల 98వేలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కులవృత్తిని ప్రోత్సహిస్తుందని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నా రు. మంజూరైన ప్రొసిడింగ్ను వెల్జాల్ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం నాయకుడు బాలకిష్టయ్యకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రయ్య, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.