పరిగి, ఆగస్టు 18: సర్కారు బడుల్లో చక్కటి సదుపాయాలు కల్పిస్తున్నామని, విద్యార్థులు ఒక లక్ష్యం ఏర్పరచుకొని చదవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తన సొంత డబ్బులు వెచ్చించి విద్యార్థులకు ఎనిమిది వేల ఉచిత బస్పాసులు అందజేసే కార్యక్రమాన్ని శుక్రవారం పరిగిలోని జడ్పీహెచ్ఎస్ నెం.1, బాలికల ఉన్నత పాఠశాలల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు. మూడేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం సదుపాయాల కల్పన పూర్తవుతుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతో కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని పేర్కొన్నారు. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం అందించడంతోపాటు చక్కటి పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం, రాగిజావ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కేవలం చదువుపైనే దృష్టి కేంద్రీకరించేలా సర్కారు చర్యలు తీసుకుం టున్నదన్నారు. విద్యార్థులు ఒక ప్రణాళిక ప్రకారం చదివి ఉత్తమ ఫలితాలు సాధిం చడంపైనే దృష్టి కేంద్రీ కరించాలని ఎమ్మెల్యే సూచించారు. అవసరమైన ప్రతి విద్యార్థికి ఉచిత బస్పాస్ సదు పాయం కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ కరుణశ్రీ, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ చైర్మన్ ఎ.సురేం దర్, సీనియర్ నాయకుడు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు కృష్ణారెడ్డి, బుగ్గయ్య, కౌన్సిలర్ మునీర్, బీఆర్ఎస్ నాయకులు బి.రవికుమార్ పాల్గొన్నారు.
ప్రతి గ్రామపంచాయతీకి నూతన భవనం
ప్రతి గ్రామపంచాయతీకి నూతన కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగి మండలం జాఫర్పల్లి గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీ భవన నిర్మాణంతో పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కొత్తగా గ్రామపంచాయతీల ఏర్పాటుతో ఆయా గ్రామాలకు నేరుగా ప్రభుత్వ నిధులు అందించడం వల్ల అభివృద్ది జరుగుతుందని చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు అభివృద్దితోపాటు సుందరంగా తీర్చిదిద్దబడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, సీనియర్ నాయకుడు బి.ప్రవీణ్కు మార్రెడ్డి, సర్పంచ్ అనిత, నాయకుడు లాల్కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.