వికారాబాద్ జిల్లా మీ దుగా రెండు జాతీయ రహదారులు వెళ్లనుండ గా.. ఆ రెండు హైవేలకు కొడంగల్ పట్టణం ఓ కూడలిగా మారనున్నది. ప్రస్తుతం హైదరాబాద్-బీజాపూర్ 163 హైవే రహదారి అందుబాటులో ఉండగా.. త్వరలోనే మహబూబ్నగర్-చించోలి 167 హైవేను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. నిధుల విడుదలతోపా టు టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ నెల ఐదో తేదీ వరకు టెండర్ల దాఖలుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో జిల్లా పరిధిలో ఈ హైవే కింద 42 కిలోమీటర్ల మార్గం జాతీయ రహదారిగా అభివృద్ధి చెందనున్నది.
-కొడంగల్, డిసెంబర్ 2
కొడంగల్, డిసెంబర్ 2: ప్రస్తుతం జిల్లా మీదుగా హైదరాబాద్-బీజాపూర్ హైవే 163 మన్నెగూడ నుంచి పరిగి, కొడంగల్ మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని చించోలి వరకు వెళ్తుంది. గతంలో ఈ హైవేను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ డెవలప్ చేసింది. బెంగళూరు-ముంబాయి జాతీ య రహదారులను అనుసంధానం చేసే యోచనలో భాగంగా ఈ రహదారిని ఏర్పాటు చేసింది. ఈ హైవే అనుసంధానికి ప్రపంచ బ్యాంకు సహకారంతో నిధులు కూడా మంజూరయ్యాయి. అయితే ఆ నిధులతో షాద్నగర్ నుంచి షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి మీదుగా కండి వరకు ఉన్న రోడ్లను అభివృద్ధి చేశారు.
తాజాగా మరోసారి బెంగళూరు-ముంబాయి జాతీయ రహదారులను డెవలప్ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. అందులో భా గంగానే మహబూబ్నగర్ జిల్లా సమీపంలోని భూత్పూర్ నుంచి కోస్గి, కొడంగల్, తాండూరు మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని చించోలి వరకు దాదాపుగా 96 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారిగా మార్చి అభివృద్ధి చేయనున్నారు. కాగా భూ త్పూర్ నుంచి కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల వరకు ఉన్న రోడ్డు నారాయణపేట డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ రోడ్డు నిర్మాణానికి గత ఆరు నెలల క్రితమే నిధులు మంజూ రు కావడంతోపాటు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తైంది.
వికారాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న 42 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి కేంద్ర మంత్రిత్వశాఖ నుంచి అనుమతి లభించకపోవడంతో ఆలస్యమైనది. కొడంగల్-తాండూరు మీదుగా కర్ణాటక రాష్ట్ర సరిహద్దు వరకు ఉన్న రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. నిధుల మంజూరుతోపాటు అనుమతుల మం జూరుకు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్రం గా కృషి చేశారు. దుద్యాల నుంచి కర్ణాటక సరిహద్దు వరకు ఉన్న 42 కిలోమీటర్ల రోడ్డును డెవలప్ చేసేందుకు ప్రభుత్వం రూ.487.12 కోట్ల నిధులను మంజూరు చేసింది. ల్యాండ్ అక్వేషన్తోపాటు రోడ్డు నిర్మాణానికి అధికారులు రూ. 631కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. దీని ద్వా రా దుద్యాల నుంచి కొడంగల్ వర కు ప్రస్తుతం ఉన్న రోడ్డు పది మీ టర్ల వరకు వెడల్పు కానున్న ది. కొడంగల్ నుంచి తాండూ రు వరకు నాలుగు లేన్ల రోడ్లు ఏర్పాటు కానున్నది.దుద్యాల నుంచి కొడంగల్ రోడ్డు డబుల్ రోడ్డుగా మారనున్నది.
కొడంగల్, తాండూరు పట్టణాలకు బైపాస్ రోడ్లు
జిల్లా మీదుగా 167 హైవేను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కొడంగల్, తాండూరు పట్టణాల్లో బైపాస్ రోడ్లు ఏర్పాటు కానున్నాయి. కొడంగల్ పట్టణంలో నాలుగు కిలోమీటర్లు, తాండూరు పట్టణంలో తొమ్మిది కిలోమీటర్ల దూరం వరకు బైపాస్ రోడ్లు నిర్మాణం కానున్నాయి. కాగా రోడ్ల విస్తరణ కోసం వికారాబాద్ జిల్లాలో 175 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
రెండు హైవేలతో నియోజకవర్గాభివృద్ధి
రెండు హైవేల ఏర్పాటుతో కొడంగల్ నియోజకవర్గానికి మహర్దశ పట్టనున్నది. కొడంగల్ మీదుగా ఇప్పటికే జాతీయ రహదారి-163 ఏర్పాటు కావడంతో బొంరాస్పేట నుంచి కొడంగల్ మండల సరిహద్దు వరకు ఉన్న ప్రజలకు రవాణా సౌకర్యవంతంగా మారింది. త్వరలోనే నిర్మాణం కానున్న మహబూబ్నగర్-చించోలి 167 హైవేతో కోస్గి పట్టణ శివారు నుంచి కొడంగల్ వరకు.. కొడంగల్ నుంచి తాండూరు వరకు నాలుగు లేన్ల రోడ్డు ఏర్పాటు కానుండటంతో రవాణా మరింత సౌకర్యవంతం కానున్నది. 163 హైవే ఏర్పాటుతో ఇప్పటికే స్థానికంగా భూముల ధరలు పెరిగాయి. 167 హైవే ఏర్పాటైతే దుద్యాల నుంచి కొడంగల్ మీదుగా తాండూరు వరకు భూముల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నది. అంతేకాకుండా స్థానికులకు ఉపా ధి అవకాశాలూ మెరుగుపడే వీలుంది.
– పట్నం నరేందర్రెడ్డి ఎమ్మెల్యే, కొడంగల్