పెద్దేముల్, మార్చి 2 : తల్లి ప్రోత్సాహం.. అన్నదమ్ముల సహకారంతో రెండు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి యువతకు ఆదర్శంగా నిలిచింది మండల కేంద్రానికి చెందిన షాకెరాబేగం.. పేదరికం ఆత్మవిశ్వాసం ముందు నిలువదని నిరూపించింది. మండల కేంద్రానికి చెందిన మహ్మద్ ఇబ్రహీం, రహ్మత్ సుల్తా నా దంపతులకు మొత్తం 8 మంది సంతానం. అందులో నలు గురు కుమార్తెలు, నలుగురు కుమారులున్నారు. ఇబ్రహీం పిల్ల లు చిన్నగా ఉండగానే చనిపోయాడు. భర్త మృతితో కుటుంబ బాధ్యతలు సుల్తానాపై పడ్డాయి. ఆపై కష్టపడి తన పిల్లలను పెంచి పెద్ద చేసింది.
కుమార్తెలను ఉన్నతంగా చదివింది. కాగా 2012 డీఎస్సీలో పెద్ద కుమార్తె అశ్రుబేగంకు ఎస్ఏ హిందీ ప్ర భుత్వ టీచర్గా ఉద్యోగం వచ్చింది. ఆమె అడుగుజాడల్లో నడు స్తూ షాకెరాబేగం కూడా ఉర్దూ విభాగంలో పీజీ పూర్తి చేసింది. టీఎంఆర్జేసీ బాలికల కళాశాల-1 వికారాబాద్లో అవుట్సోర్సింగ్లో ఉర్దూ విభాగంలో జూనియర్ లెక్చరర్గా చేరింది. సమయం దొరికనప్పుడల్లా చదువుతూ మొదటి ప్రయత్నంలో నే ఉర్దూ విభాగంలో రెండు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిం ది. అందులో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూ షన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఫిబ్రవరి -2023లో వెలువడిన నోటిఫికేషన్ జనరల్ రిక్రూట్మెంట్లో రాష్ట్రస్థాయిలో 9 స్థానంలో నిలిచి ఉర్దూ విభాగంలో జూనియర్ లెక్చరర్గా సర్కారు జాబ్ను సాధించింది.
తదుపరి సెప్టెంబర్-20 23లో వెలువడిన నోటిఫికేషన్లో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ)గా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది. ఈ సందర్భం గా షాకెరాబేగం మాట్లాడుతూ ..నిరుపేద కుటుంబంలో పుట్టి రెండు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన విజయం వెనుక తల్లి ప్రోత్సాహం.. అన్నద మ్ముల సహకారాన్ని మరువలేనన్నారు. అదేవిధంగా నిజాం కళాశాల ప్రొఫెసర్ ఇస్మాయిల్, ఉస్మానియా క్యాంపస్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ముస్తాఖ్ అహ్మద్, జైబా అంజుమ్, ఉర్దూ విభాగం హెచ్వోడీ జావిద్మోహిద్, టీఎంఆర్జేసీ బాలికల కళాశాల-1 వికారాబాద్ ప్రిన్సిపాల్ స్వాతిరెడ్డిలు ఎంతో ప్రోత్సహించడం తోపాటు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారన్నారు.
కులకచర్ల : పేదరికాన్ని జయించి కులకచర్ల గ్రామ యువకులు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం అభినందనీయమని కులకచర్ల ఎంపీటీసీ ఆనందం, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొలుసాని శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం కులకచర్ల మండల కేంద్రానికి చెందిన పలువురికి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో వారిని ఘనంగా సన్మానించారు. పేదరికంలో పుట్టినప్పటికీ ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గొప్పవిషయమని తెలిపారు. కార్యక్రమంలో రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూర్ వెంకటేశ్, అంజి, వెంకటయ్య, శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.
నవాబుపేట : ఇటీవల ప్రకటించిన గురుకుల ఉద్యోగ ఫలితాలలో నాలుగు ఉద్యోగాలకు మహిపాల్ ఎంపికయ్యాడు. నవాబుపేట మండలం, పులుమామిడి గ్రామానికి చెందిన లక్ష్మీగళ్ల జంగయ్య, అనంతమ్మ దంపతుల మూడో కుమారుడైన మహిపాల్ డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ (2వ ర్యాంక్), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (2వ ర్యాంక్), ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా మండల ప్రజలు అభినందనలు తెలిపారు.
వికారాబాద్ : గురుకుల బోర్డు నిర్వహించిన కాంపిటీటివ్ పరీక్షల్లో దుద్యాల పావని నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించింది. వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడకు చెందిన దుద్యాల పావని తల్లి ఓ దవాఖానలో స్వీపర్గా పని చేస్తుంది. పావని డిగ్రీ, పీజీ, బీఈడీ పూర్తి చేసింది. ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగింది. 2023 ఆగస్టులో రాసిన గురుకులాల్లో నాలుగు ఉద్యోగాలకు ఉత్తీర్ణత సాధించింది. డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలకు ఎంపికైంది. ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
దుద్యాల చంద్రమ్మ కూతురు పావని గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించిన సందర్భంగా కాలనీ వాసులు శనివారం శాలువాలతో ఘనంగా సన్మానించారు. సన్మానించిన వారిలో కాలనీ వాసులు లక్ష్మణ్, సంతోశ్, సుధాకర్, బుచ్చయ్య, రమేశ్ తదితరులు ఉన్నారు.