పరిగి, మార్చి 6 : ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణి అవలం భిస్తున్నదని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పిన కాంగ్రెస్ నాయకులు నేడు ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజల నుంచి రూ.20వేల కోట్ల వసూళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేప ట్టడం సరికాదన్నారు. ఎల్ఆర్ఎస్ చెల్లింపులు లేకుండా ఉచితంగానే స్థలాల క్రమ బద్ధీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పరిగిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్కు డబ్బులు చెల్లించవద్దని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేటి మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రజలకు సూచించారని, తాము అధి కారంలోకి వస్తే ఉచితంగానే క్రమబద్ధీకరిస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందన్నారు. ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజల నుంచి ఫీజు వసూలుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడం సరికాదన్నారు. కాంగ్రెస్ రెండు నాలు కల ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కర్రు కాల్చి కాంగ్రెస్కు వాత పెడతారన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ పార్టీ ఎగనామం పెడుతుందని ఆయన విమర్శించారు.
నిరుద్యోగ యువతకు భృతి నెలకు రూ.4వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నేడు అసలు హామీ ఇవ్వలేదని అబ ద్దాలు ఆడుతుందని దుయ్యబట్టారు. ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా అందజేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నేడు ఈ హామీ అరకొరగా అమలు చేసేందుకు అనేక సాకులు చెబుతుందన్నారు. రాష్ట్రంలో సుమారు 90లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, అలాగే కార్డులు లేని వారు లక్షలాది మంది ఉండగా సగం ఇండ్లకు కూడా ఉచిత కరెంటు ఇవ్వకపోవడం ద్వారా హామీకి ఎగనామం పెడుతుం దని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. కార్యకర్తలు అధైర్యపడరాదని, కంటికి రెప్పలా పార్టీ కాపాడుకుంటుందని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజు రద్దు చేసి ఇంటి స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కరణం అరవిందరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎ.సురేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బి.ప్రవీణ్ కుమార్రెడ్డి, పి.వెంకటయ్య, పీరంపల్లి రాజు, సారా శ్రీనివాస్, మండల ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు కె.వెంకట్రాంరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, మాజీ సర్పంచ్లు జి.అశోక్వర్దన్రెడ్డి, నల్క జగన్, వెంకటయ్య, ఆర్.శ్రీనివాస్, మండల కో-ఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్, కౌన్సిలర్లు మునీర్, వారాల రవీంద్ర, వెంకటేశ్, ఎదిరె కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు మాణిక్యం, బి.రవికుమార్, మౌలానా, నయీమ్, తాహెర్అలీ తదితరులు పాల్గొన్నారు.
తాండూరు: ఇచ్చిన హామి మేరకు కాంగ్రెస్ నేతలు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం తాండూరు పట్టణం అంబేద్కర్ చౌక్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తాండూరు ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినట్లు లే అవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ ఆర్ఎస్)ను ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా లే అవుట్ రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను గందరగోళం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ అంటే కష్టాలు… కష్టాలు అంటేనే కాంగ్రెస్ అనేలా రాష్ట్రంలో హస్తం పాలన ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లేమి, అనుభవరాహిత్యంతో సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి తయారైందన్నారు.
రూ. వేల కోట్లే లక్ష్యంగా నిరుపేద ప్రజల రక్తం తాగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతుందన్నారు. హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్కు అలవాటైందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు. మోసం చేసిన వారికి ఎన్నికల్లో సరైన బుద్ధి చెబుతామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు రాజూగౌడ్, వీణ, దీప, నర్సిరెడ్డి, రవీందర్రెడ్డి, శోభారాణి, సంగీతఠాకూర్, వెంకట్రెడ్డి, ఉమాశంకర్, రమేశ్, అనిల్ తదితరులున్నారు.
కొడంగల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 90 రోజుల కావస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలు పూర్తి చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు.
బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ఇచ్చిన గడువులోగా పూర్తి చేయాలని లేదంటే బీఆర్ఎస్ పార్టీ వార్కు సిద్ధంగా ఉందని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజ్గోపాల్ తదితరులు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని, అధికారంలోకి మాట మార్చి ఎల్ఆర్ఎస్పై వసూళ్లకు సిద్ధం అవుతున్నట్లు ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ ద్వారా రూ.20వేల కోట్ల సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతుందని, కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు.
గతంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రాజెక్టు పనులు పూర్తి కాగా రూ. రెండు లేదా మూడువేల కోట్లు వెచ్చిస్తే కాలువల నిర్మాణంతో కొడంగల్ నియోజకవర్గానికి లక్షా 49వేల ఎకరాలకు సాగు నీరు అందేదన్నారు. కొడంగల్-నారాయణపేట ఎత్తి పోతల పథకాన్ని తెరపైకి తీసుకొచ్చి నీళ్లు వచ్చే పథకానికి అడ్డు వేశారన్నారు. జూరాల ప్రాజెక్టులో ఏడు టీఎంసీల నీటి నిల్వలో మూడు టీఎంటీలు డెడ్ స్టోరేజ్గా ఉంటుందని, మిగిలిన నాలుగు టీఎంసీల నీటిలో నారాయణపేటలో 80వేల ఎక రాలకు, కొడంగల్లో లక్షా 49వేల ఎకరాలకు సాగునీరు ఏవిధంగా సరిపోతుందని ప్రశ్నించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు వ్యతిరే కించిన ఫ్యాక్టరీలను కొడంగల్ ప్రజలకు అంటకట్టేందుకు సీఎం చూస్తున్నారని, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్ధేశ్యం ఉంటే ఐటీ పార్క్, ఐటీ హబ్, టెక్స్టైల్ వంటి వాటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో ఈ ప్రాం తంలో చెక్ డ్యాంల నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.70కోట్లు మంజూరు చేసిందన్నారు. మరో రూ. 150కోట్లు మంజూరుతో చెక్ డ్యామ్ల నిర్మాణాలు చేపట్టి చెరు వులను సుందరీకరణ చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్ధాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ ఎంపీపీ విజయ్కుమార్, జడ్పీటీసీ కోట్ల మహిపాల్, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్యాదవ్, బొంరాస్పేట మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ బొంరాస్పేట, దుద్యాల అధ్యక్షులు కోట్ల యాదగిరి, చాంద్పాషా, బీఆర్ఎస్ నాయకులు నవాజోద్దిన్, ఫయూం, సయ్యద్ అంజద్, రమేశ్బాబు. పాల్గొన్నారు.