తుర్కయాంజాల్, ఏప్రిల్ 29 : బడుగు, బలహీన వర్గాల వ్యక్తి, నిత్యం ప్రజల్లో ఉండే క్యామ మల్లేశ్ను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ చౌరస్తాలో నిర్వహించిన రోడ్షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఐదు నెలలు దాటినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. మరోసారి మోసపోవద్దని ప్రజ లు, బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు.
బీఆర్ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే రేవంత్ ప్రభుత్వంతో పోరాడి సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగేలా చూస్తామన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్ మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వచ్చి ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు.
మరోమారు కాంగ్రెస్ నాయకుల మాయమాటలను నమ్మి ఇబ్బందిపడొద్దని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్రెడ్డి, రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, కౌన్సిలర్లు, కల్యాణ్నాయక్, జ్యోతి, తుర్కయాంజాల్ రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, అశోక్, రాజీరెడ్డి, సంపతీశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్తో కలిసి మంచిరెడ్డి కిషన్రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు మాసాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం బయటపడిందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేండ్లలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు దండెం రాంరెడ్డి, జక్క రాంరెడ్డి, విఠల్రెడ్డి, పూజారి చక్రవర్తిగౌడ్, ప్రవీణ్కుమార్, భాస్కర్గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు కిషన్గౌడ్, ప్రధానకార్యదర్శి వెంకట్రెడ్డి, మాజీ సర్పంచ్లు కిరణ్కుమార్గౌడ్, రంగయ్య, మల్లేశ్, రాధాకృష్ణ, యాదయ్య, ఎంపీటీసీలు సాయికుమార్గౌడ్, యాదగిరి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.