చేవెళ్ల రూరల్/చేవెళ్లటౌన్/మొయినాబాద్, ఏప్రిల్ 22 : స్వర్గీయ మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బుధవారం మాజీ హోంమంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని మం డల పరిధిలోని ఆయన స్వగ్రామం కౌకుంట్లలోని సమాధి వద్ద కుమారులు కార్త్తిక్రెడ్డి, కౌశిక్రెడ్డి, కల్యాణ్రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డిలతో కలిసి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు ఇంద్రారెడ్డినగర్, చిట్టంపల్లిగేట్లోని ఇంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. ఇంద్రారెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని, ప్రజా సంక్షేమం కోసం ఆయన ఎప్పుడూ పరితపించేవారని గుర్తు చేశారు.
ఆయన చూపిన మార్గంలోనే ముందుకు సాగుతున్నామన్నారు. ఇంద్రారెడ్డి మనకు దూరమై 26 ఏండ్లు కావొస్తున్నా ఇంకా ప్రజల గుండెల్లోనే ఉన్నాడన్నారు. పట్లోళ్ల కుటుంబాన్ని చేవెళ్ల గడ్డ రాజకీయంగా ఆదరించిందని.. ఈ ప్రాంత ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ సేవలందిస్తామన్నారు. అదేవిధంగా మొయినాబాద్ మున్సిపాలిటీ కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారెడ్డి వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సబితారెడ్డితోపాటు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే, మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి, సజ్జన్పల్లి, చిలుకూరు, రెడ్డిపల్లి, నాగిరెడ్డిగూడ, ముర్తుజాగూడ గ్రామాల్లో ఇంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి మాజీ చైర్మన్ పులిమామిడి నారాయణ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోంపల్లి అనంతరెడ్డి, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, పట్లోళ్ల కౌశిక్రెడ్డి, దేశమొళ్ల ఆంజనేయులు, కౌకుంట్ల సర్పంచ్ మల్లారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, శ్రీధర్రెడ్డి, నరేందర్రెడ్డి, దశరథ్, లక్ష్మీప్రసన్నశేఖర్, సులోచనాఅంజన్గౌడ్, హన్మంత్రెడ్డి, మహేందర్రెడ్డి, కరుణాకర్రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, బాల్రాజ్, కృష్ణారెడ్డి, ప్రసాద్, శ్రీహరియాదవ్, నరోత్తంరెడ్డి, సుధాకర్యాదవ్, వెంకట్రెడ్డి, గణేశ్రెడ్డి, నరహరిరెడ్డి, ప్రభాకర్, శివారెడ్డి, హన్మంత్రెడ్డి, మల్లారెడ్డి, జయవంత్, రవియాదవ్, శ్రీనివాస్, జగన్మోహన్రెడ్డి, నర్సింహులు, కృష్ణారెడ్డి, వెంకటేశ్, సాయినాథ్, మాణిక్రెడ్డి, సర్పంచ్ కృష్ణ, నర్సింహాగౌడ్, మహబూబ్, సురేందర్గౌడ్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.