యాచారం, అక్టోబర్ 19 : ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్రా తరలించే వారిపై నిఘాను పెంచారు. ముఖ్య కూడళ్లలో చెక్పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటల పాటు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మండలంలో వాహనాల తనిఖీలను పోలీసులు మరింత ముమ్మరం చేశారు.
జిల్లా సరిహద్దు ప్రాంతమైన మండలంలోని మాల్ మార్కెట్లో నాగార్జునసాగర్ రహదారిపై పోలీస్ చెక్పోస్టును ఏర్పాటు చేశారు. గురువారం నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్కు వెళ్లే వాహనాలను తనిఖీ చేశారు. కార్లు, జీపులు, క్రూయిజర్లు, ఆటోలు, ట్యాక్సీలు, డీసీఎంలు, ట్రాలీ ఆటోలు తదితర ప్రైవేట్ వాహనాలను చెక్ చేస్తున్నారు. వాహనాలలో డబ్బులు, ఇతర వస్తువులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భాగంగా రూ.4 లక్షల 10వేల నగదును గురువారం పట్టుకున్నారు. సీఐ సైదయ్య తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలో ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భాగంగా మల్కీజ్గూడ గ్రామానికి చెందిన రమేశ్ నుంచి రూ.4 లక్షల 10వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును సీజ్ చేసి డీటీవోలో డిపాజిట్ చేసినట్లు ఆయన తెలిపారు. లెక్కకు మించి నగదును, బంగారాన్ని తరలిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
కొత్తూరు : ఎన్నికల కోడ్లో భాగంగా రూ. 5 లక్షలు స్వా ధీనం చేసుకున్నారు. ఈ ఘట న కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చేగూర్ రోడ్డు వద్ద గురువారం జరిగింది. కొత్తూరు సీఐ శంకర్రెడ్డి తెలిపిన వివరా లు.. హైదరాబాద్ నుంచి చేగూర్ వైపు వెళ్తున్న కారును కొత్తూరు పోలీసులు తనిఖీ చే యగా రూ.5 లక్షలు దొరికాయి. ఓనర్ నవనీత్ ఆగర్వాల్ ఆ డబ్బుకు ఎ లాంటి పత్రాలు చూపించలేదు. దీంతో ఆ డబ్బును స్వాధీనం చేసుకొని ఎలక్ట్రోరల్ రిటర్నింగ్ అధికారికి పంపామని సీఐ శంక ర్రెడ్డి తెలిపారు. తనిఖీల్లో ఎస్సై శ్రీనివాస్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.