షాద్నగర్ : ఓ ప్లెవుడ్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తుండగా ముగ్గరు కార్మికులు అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎలైట్ అనే ప్లైవుడ్ తయారీ పరిశ్రమంలో బీహార్ రాష్ట్రానికి చెందిన శశికాంత్, రాజత్కుమార్, రాంకుమార్ అనే కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం ఖాళీ కెమికల్ ట్యాంక్కు గ్యాస్ వెల్డింగ్ చేస్తుండగా సిలిండర్ గన్ నుంచి మంటలు వచ్చాయి. ఈ ప్రమాదంలో శశికాంత్కు తీవ్ర గాయాలు కాగా, రాజత్కుమార్, రాంకుమార్లకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన తోటి కార్మికులు వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని షాద్నగర్ పోలీసులు పరిశీలించారు.